రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యువతి దుర్మరణం.. గోవాలో ఘటన

     Written by : smtv Desk | Tue, Mar 12, 2024, 12:19 PM

రోడ్డు ప్రమాదంలో నెల్లూరు యువతి దుర్మరణం..  గోవాలో ఘటన

మృత్యువు ఎప్పుడు ఎవరిని ఎలా కబలిస్తుందో తెలియదు. అప్పటి వరకు నవ్వుతూ ఆడిపాడిన వ్యక్తులు ఉన్నట్టుండి కుప్పగిలిపోవడం లేదా ఏదైనా ప్రమాదం సంభవించడం వంటి ఘటనలు నిత్యం మన కళ్ళ ముందు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా యువతి పూజిత గోవాలో జరిగిన రోడ్డు ప్రమాదంలోదుర్మరణం చెందింది. స్నేహితుడితో కలిసి లంచ్ చేసేందుకు హోటల్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన పూజిత ఆసుపత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస వదలగా.. ఆమె స్నేహితుడు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అంజునా పోలీసుల వివరాల ప్రకారం..

ఏపీకి చెందిన పూజిత, హర్యానాకు చెందిన శివం ఉప్లాక్ష్ స్నేహితులు.. ఇద్దరూ గోవా ట్రిప్ కు వచ్చారు. స్థానికంగా బైక్స్ రెంట్ కు ఇచ్చే ఓ షాప్ లో స్కూటీని అద్దెకు తీసుకున్నారు. సోమవారం ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు అంజునాలోని ఓ రెస్టారెంట్ కు బయలుదేరారు. స్కూటీని శివం నడుపుతుండగా పూజిత వెనక కూర్చుంది. స్టార్ కో జంక్షన్ లో స్కూటీ అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గోడను ఢీ కొట్టింది. దీంతో వెనక కూర్చున్న పూజిత ఎగిరి రోడ్డుపై పడిపోయింది. వెనకే వేగంగా వస్తున్న కారు ఆమె పైకెక్కింది. అయినా డ్రైవర్ కారును ఆపకుండా ముందుకు పోనివ్వడంతో పూజిత శరీరం నలిగిపోయింది.

దాదాపు వంద మీటర్ల వరకు కారు ఆమెను ఈడ్చుకెళ్లింది. శివం కూడా గాయాలపాలయ్యాడు. స్థానికులు వారిద్దరినీ సమీపంలోని ఆసుపత్రికి తరలించగా.. పూజిత అప్పటికే చనిపోయిందని వైద్యులు ప్రకటించారు. శివంను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. కాగా, పూజిత డెడ్ బాడీని బంబోలిమ్ లోని మెడికల్ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచామని, పోస్టుమార్టం చేశాక ఆమె కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని అంజునా పోలీసులు తెలిపారు. కారు డ్రైవర్ సమ్రీన్ భవానీని అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరుపై విచారిస్తున్నట్లుగా తెలుస్తుంది. సరదా కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్ళిన పూజిత మృతి అందరి మనసులను కలచివేస్తుంది.





Untitled Document
Advertisements