బరువు తగ్గాలి అనుకునే వారు వేరుశెనగలు ఇలా తినడం బెస్ట్

     Written by : smtv Desk | Thu, Mar 14, 2024, 11:10 AM

బరువు తగ్గాలి అనుకునే వారు వేరుశెనగలు ఇలా తినడం బెస్ట్

గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా సాయంత్రం సమయంలో వారికీ అందుబాటులో ఉండే పల్లీలను తింటూవుంటారు . ఎందుకంటే అక్కడ దొరికేవి అవి మాత్రమే . వీటిని తినడం వలన చాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే, ఉడకబెట్టిన పల్లీలు, వేయించిన పల్లీలు, ఈ రెండు రుచికరమైనవే కాదు. ఎంతో హెల్దీ కూడా వీటిని పచ్చిగా, ఉడకబెట్టి, వేయించి, చట్నీగా చేసి, కూరల్లో వేసి ఇలా ఎన్ని రకాలుగానైనా తీసుకుంటారు. దీని వల్ల శరీరానికి చాలా పోషకాలు అందుతాయి.

వేరుశనగల్లోని పోషకాలు.. వేరుశనగల్లో విటమిన్స్, ఖనిజాలు, ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇందులో నియాసిన్, ఫోలేట్, థయామిన్, రిబోఫ్లేవిన్, విటమిన్ ఇ, డైటరీ ఫైబర్, పొటాషియం, కాల్షియం, కాపర్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, జింక్, సెలీనియం, బి విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.


వేయించి తింటే..పిల్లలు ఇష్టంగా పల్లీలను తినాలి అంటే వేయించి ఇవ్వాలి . ఇవి చాలా రుచిగా, క్రంచీగా ఉంటాయి. దాని వలన తినడానికి ఇష్ట పడతారు . వీటిలో మంచి ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. మితంగా తీసుకుంటే రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి. ఎక్కువగా తీసుకుంటే మాత్రం కొలెస్ట్రాల్ పెరగడం, నోటి పూత వంటి సమస్యలు కూడా వస్తాయి.

ఉడికించిన వేరు శనగలు.. ​బరువు తగ్గాలనుకునేవారు ఉడికించిన వేరు శనగలని స్నాక్స్‌గా తీసుకోవచ్చు. ఇందులో ఉల్లిపాయ, దోసకాయ, టమాట, నిమ్మరసం, ఉప్పు, మిరియాల పొడి కలిపి రాత్రి డిన్నర్, బ్రేక్‌ఫాస్ట్ టైమ్‌లో తీసుకోవచ్చు. ఇందులో ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకుంటే ఆకలి కంట్రోల్ అవుతుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉన్నట్లుగా ఉంటుంది. అధిక కేలరీలని తీసుకోవడాన్ని కంట్రోల్ చేస్తుంది. బరువు తగ్గడంలో హెల్ప్ అవుతుంది.

షుగర్ ఉన్నవారు.. షుగర్ ఉన్నవారు వేరుశనగల్ని వేయించి, ఉడికించి తినొచ్చు. కానీ, వేయించిన వాటి కంటే ఉడికించిన శనగలు చాలా మంచివి. ఇందులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. చక్కెర కూడా ఉండదు. కాబట్టి, ఉడికించిన వేరుశనగలు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు స్థిరంగా ఉంటాయి.

వాత, పిత్త, కఫ దోషాలకి మందుగా.. వేయించిన వేరుశనగలని తొక్క తీసేసి తింటాం. కానీ, దాని చర్మంలో ఫైబర్ మాత్రమే కాకుండా ఎంజైమ్స్ కూడా ఉంటాయి. చర్మంలోని అణువులు బాడీలోని పైత్యరసాన్ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. పైత్య రసం ఎక్కువగా ఉన్నవారు వీటిని ఉడికించి, నానబెట్టి తినడం మంచిది.

గుండె సమస్యలు ఉన్నవారికి.. హైబీపి, గుండె జబ్బులు ఉన్నవారు పల్లీలు తినకూడదని అంటారు. కానీ, పల్లీలను తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా ఉడికించిన పల్లీలను స్నాక్స్‌గా తీసుకోవాలి. కానీ, మితంగా మాత్రమే తీసుకోవాలి. ఇందులో గుడ్ ఫ్యాటీ యాసిడ్స్, పీచు కొలెస్ట్రాల్‌ని పెంచదు. రక్తపోటుని బ్యాలెన్స్‌డ్‌గా ఉంచుతుంది. కాబట్టి, గుండె సమస్యలు ఉన్నవారు వారానికి 3 నుంచి 4 రోజులు పల్లీలను ఉడికించి స్నాక్స్‌గా హ్యాపీగా తీసుకోవచ్చు.

నూనెలో వేయించి.. వేయించిన పల్లీలను అప్పడప్పుడు తినొచ్చు. కానీ, నూనెలో వేయించి మసాలలు కలిపిన పల్లీలను తీసుకోవద్దు. దీని వల్ల చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. కాబట్టి, డ్రై రోస్ట్ చేసిన పల్లీలను అప్పుడప్పుడు తినొచ్చు.ఈవినింగ్ స్నాక్స్ గా పునుగులు , సమోసాలు వంటి ఆయిల్ ఐటమ్స్ పిల్లలకి పెట్టకుండా మంచి ప్రోటీన్స్ ఉన్న ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి .





Untitled Document
Advertisements