నేడు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిని సోదా చేసిన ఈడీ అధికారులు చివరికి ఆమెను అరెస్ట్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తెర మీదకు వచ్చిన నాటి నుండి ఆమె అరెస్ట్ చేస్తున్నారు అనే వార్తలు అనేకసార్లు వినిపించాయి. చివరకు ఈడీ అధికారులు ఇప్పుడు కవిత అరెస్ట్ ను నిర్ధారించారు. కాసేపట్లో ఆమెను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తరలించనున్నారు. ఈ నేపథ్యంలో కవిత ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాసేపటి క్రితం కవిత ఇంటి వద్దకు కేటీఆర్, హరీశ్ రావు చేరుకున్నారు. వీరిని కూడా కవిత ఇంట్లోకి అధికారులు అనుమతించలేదు. కవిత ఇంటి గేటు వెలుపలే వీరు నిలుచున్నారు.
కవిత నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో చేరుకున్న బీఆర్ఎస్ శ్రేణులు బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోదీ డౌన్ డౌన్ అని నినాదిస్తున్నారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కుట్రపూరిత రాజకీయాలకు పాల్పడుతోందని మండిపడుతున్నారు. కవిత నివాసంలో కవిత, ఆమె భర్త, పిల్లలు, పీఏ, సహాయకులు మాత్రమే ఉన్నారు. తరువాత పరిస్థితులు ఎంటా అని బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.