కవిత అరెస్ట్ ను ఖండిస్తూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం

     Written by : smtv Desk | Fri, Mar 15, 2024, 06:53 PM

 కవిత అరెస్ట్ ను ఖండిస్తూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇంటిని సోదా చేసిన ఈడీ అధికారులు ఆమెను కాసేపటి క్రితం అరెస్ట్ చేయడంపై మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కవిత అన్నయ్య కేటీఆర్ ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలతో వాగ్వాదానికి దిగారు. వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవితను అరెస్ట్ చేశారనే విషయం తెలిసిన కేటీఆర్, హరీశ్ రావు ఆమె నివాసానికి చేరుకున్నారు. విచారణ ముగిసిన అనంతరం కవిత ఇంట్లోకి వెళ్లిన కేటీఆర్.. ఈడీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించి వీడియో వెలుగు చూసింది.
సోదాలు పూర్తయ్యాయని, అరెస్ట్ వారెంట్ ఇచ్చామని ఈడీ అధికారులు భానుప్రియ, మీనాలు చెబుతున్నారని, అలాగే అరెస్ట్ వారెంట్ ఇచ్చామని చెబుతున్నారని పేర్కొన్నారు. సోదాలు ముగిశాక కూడా ఇంట్లోకి రావొద్దని అధికారులు హుకూం జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టుకు చెప్పిన తర్వాత ఇప్పుడు ఎలా అరెస్ట్ చేస్తారు? అని వారిని ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చెప్పిన మాటను ఈడీ అధికారులు తప్పుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ద్వారా ఈడీ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. కావాలని శుక్రవారం వచ్చారని మండిపడ్డారు. ట్రాన్సిట్ వారెంట్ లేకుండా కవితను ఎలా తీసుకు వెళతారు? అని ప్రశ్నించారు.
మరి బీఆర్ఎస్ శ్రేణులు అన్నట్టు ఇదంతా కావాలని పన్నిన పన్నాగమేన లేదా కవిత నేరం చేసినట్టు రుజువైందా అనేది తెలియాల్సి ఉంది.


Untitled Document
Advertisements