వేసవి తాపం తీర్చడానికి బాదం మిల్క్ ఇంట్లోనే ఇలా చేసేయండి సులభంగా

     Written by : smtv Desk | Thu, Mar 14, 2024, 04:28 PM

వేసవి తాపం తీర్చడానికి బాదం మిల్క్ ఇంట్లోనే ఇలా చేసేయండి సులభంగా

వేసవి కాలం వచ్చేసింది ఎండా వేడి తట్టుకోవడానికి చల్లచల్లగా ద్రవపదార్థాలు తాగితే బాగుంటుంది అనుకుంటారు. ఎండ వేడిమి మీరు తట్టుకోవాలంటే శరీరానికి అందించాల్సింది ఎక్కువగా ద్రవ ఆహారాలే.. చాల మంది మజ్జిగ , కొబ్బరి నీళ్లు , బాదం పాలు తాగుతూ ఉంటారు . బాదంపాలు బయట దొరికేవి అంత మంచిగా ఉండవు కాస్ట్ కూడా చాల ఎక్కువ . అందువలన మనం ఇంట్లో చేసుకుంటే ఆ రుచే వేరు. ఒకసారి చల్లచల్లగా బాదం మిల్క్ తాగి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. బాదం మిల్క్ అనగానే బాదం పొడి బయట నుంచి కొనుక్కొచ్చి పాలల్లో కలిపి వేసుకొని తాగేది కాదు. ఇంట్లోనే టేస్టీగా దీన్ని తయారు చేయొచ్చు. ఇది చాలా బాగుంటుంది. పిల్లలకు నచ్చుతుంది. సాయంత్రం వేళ స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకు ఒక గ్లాసు బాదం మిల్క్‌ను అందిస్తే... శరీరానికి శక్తి వెంటనే అందుతుంది. పెద్దలకు కూడా ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పవచ్చు. వేసవిలో కచ్చితంగా తాగాల్సిన పానీయాల్లో బాదం మిల్క్ ఒకటి. ఈ బాదంపాలు ఇంట్లోనే టేస్టీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం.

బాదం పాలు రెసిపీకి కావలసిన పదార్థాలు
బాదం పప్పులు - ఒక కప్పు
జీడిపప్పు - ఒక కప్పు
పంచదార - 100 గ్రాములు
యాలకుల పొడి - అర స్పూను
పాలు - అర లీటరు
బాదం పాలు రెసిపీ

1. బాదంపప్పు, జీడిపప్పును మిక్సీలో వేసి మెత్తటి పొడి చేసుకోవాలి.
2. వెన్న తీయని పాలను గిన్నెలో వేసి బాగా కాచాలి. అందులో యాలకుల పొడిని కూడా వేయాలి.
3. ఆ పాలల్లో పంచదారని వేసి బాగా కలుపుకోవాలి.
4. ముందుగా మిక్సీలో చేసి పెట్టుకున్న బాదం, జీడిపప్పు పొడిని ఈ పాలల్లో వేసి చిన్న మంట మీద పది నిమిషాల పాటు మరగనివ్వాలి.
5. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వాటిని చల్లారనివ్వాలి.
6. ఈ బాదం మిల్క్‌ను గ్లాసుల్లో వేసి పైన సన్నగా తరిగిన బాదం, జీడిపప్పులను వేసి ఫ్రిజ్లో పెట్టాలి.
7. అవి బాగా చల్లగా అయ్యాక తాగి చూడండి.
8. రుచి సూపర్ గా ఉంటుంది . ఇది పిల్లలకు కచ్చితంగా నచ్చుతుంది. బయటకొనే బాదం పొడులు కన్నా దీని టేస్ట్ బాగుంటుంది.
ఈ రెసిపీలో మనం వాడే బాదం, జీడిపప్పు వంటివి ఆరోగ్యకరమైనవి . అలాగే పంచదారను చాలా తక్కువగా వాడాము. బాదం, జీడిపప్పులు మన శరీరానికి కావాల్సిన ఆరోగ్యకరమైన కొవ్వులను అందిస్తాయి. అలాగే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. బరువు తగ్గడానికి కూడా ఇవి సహాయం చేస్తాయి. ఎన్నో పోషకాలను శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు షుగర్ కు బదులు గా బెల్లం వేసుకుంటే తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. మెదడు ఆరోగ్యంగా ఉండేందుకు బాదంపప్పు ఎంతో మేలు చేస్తుంది. ఇక పాలలో కాల్షియము ఉంటుంది . ఇది శరీరానికి కాల్షియాన్ని అందిస్తుంది. అలాగే పిల్లలకు దీన్నీ ఇవ్వడం వలన ఏకాగ్రతగా పెరుగుతుంది. వేసవిలో సాయంత్రం పూట ఇలాంటి బాదం పాలు ఇవ్వడం వల్ల వారు మరింత శక్తివంతంగా మారతారు. అంతేకాకుకండా వీటిలో ఉన్న బాదం, జీడిపప్పు, పాలు ఈ మూడు కూడా పిల్లలకు మంచి బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు .





Untitled Document
Advertisements