తాజాగా బీజేపీ లోక్ సభ అభ్యర్థి ఈటల రాజేందర్ రేవంత్ రెడ్డి పై మండిపడ్డారు. నేను లోకల్ వాడిని కాదని, నాకు మల్కాజ్గిరితో ఏం సంబంధమని సిఎం రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు.. నన్ను పరాయి వ్యక్తిని అంటున్నప్పుడు రేవంత్ కూడా కాంగ్రెస్ అభ్యర్థిగా ఈ ప్రాంతం వాడినే నిలబెట్టాలి.. లేదంటే ఆయన సంగతి చెబుతానని ఈటల రాజేందర్ హెచ్చరించారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే మల్కాజ్గిరి ప్రాంతం వాడినే తనపై పోటీకి నిలపాలని సవాల్ విసిరారు.
ఈటెల మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. మల్కాజ్గిరితో తనకు ఏం సంబంధం? అని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రికి నేను ఓ సవాల్ విసురుతున్నాను.. నిజంగా నీకు దమ్ముంటే ఈ ప్రాంతం నుంచి తనపై పోటీకి నిలుపు అన్నారు. బయటి వ్యక్తిని నిలబెడితే ఊరుకునేది లేదన్నారు. రేవంత్ రెడ్డి అభ్యర్థి కోసం వెతుకుతున్నాడని.. రూ.200 కోట్లు ఖర్చు పెట్టే అభ్యర్థి వారికి కావాలట అని ఎద్దేవా చేశారు. ఈటల రాజేందర్ను తట్టుకోవాలంటే రూ.400 కోట్లు ఖర్చు పెట్టే వ్యక్తి కావాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈటెల వాఖ్యలు రాజకీయంగా హీట్ ను మరింత పెంచాయి. లోక్ సభ పోల్ లో అధికారం కోసం అన్ని పార్టీలు నువ్వా, నేనా అన్న స్థాయిలో పోటీ పడుతున్నాయి.