యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త లుక్ అదిరిపోయిందిగా

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 03:35 PM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరికొత్త లుక్ అదిరిపోయిందిగా

ఇప్పటికే ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ప్రపంచ మొత్తంతో పేరు తెచ్చుకున్నా టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. జ‌న‌తా గ్యారేజ్ మూవీ త‌ర్వాత ఎన్టీఆర్‌, కొర‌టాల కాంబో రిపీట్ అవుతుండడంతో ఈ చిత్రంపై మంచి సెన్సేసన్ క్రియేట్ అయింది. ఇక ఆర్ఆర్ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో అంతా భారీ అంచనాలు పెట్టుకున్నారు
రెండు పార్టులుగా తెరకెక్కనున్న ఈ సినిమాలో స‌ముద్ర తీర ప్రాంతంలో ఉండే స్థానికుల స‌మ‌స్య‌ల‌ను తీర్చే నాయ‌కుడిగా తారక్ కనిపించనున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఎన్టీఆర్ హీరోయిజాన్ని కొరటాల ఓ రేంజ్ లో చూపించనున్నారట. ఫుల్ క్వాలిటీ వీఎఫ్ ఎక్స్ తో మంచి విజువల్ ట్రీట్ కూడా అందించనున్నట్లు తెలుస్తోంది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజాగా మేకర్స్ ఎ న్టీఆర్ లుక్ ను షేర్ చేస్తూ షూటింగ్ గురించి క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ప్రస్తుతం గోవాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నట్లు తెలిపారు. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీలో మాంటేజ్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు వెల్లడించారు. పోస్టర్ లో తారక్ తోపాటు రాజు సుందరం, కొరటాల ఉన్నారు. అయితే మెడలో రుద్రాక్షతో ఎన్టీఆర్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు. చెక్ షర్ట్, భుజంపై తువ్వాలు, రింగు రింగుల జట్టుతో తారక్ రగ్డ్ లుక్ లో ఉన్నారు. ఈ క్రేజీ అప్డేట్ను చూస్తుంటే తెలుస్తుంది సినిమా ఏ రేంజ్ లో
ఆడుతుందో . ప్రేక్షకులను అలరించడానికి ఎన్టీఆర్ మూవీ ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అని ఎదురుచూస్తున్నారు మరి.
ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. సినిమా బ్లాక్ బస్టర్ పక్కా అంటూ కామెంట్లు పెడుతున్నారు. తారక్.. ఏ రోల్ అయినా దుమ్ముదులిపేస్తారని అంటున్నారు. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. ఈ చిత్రంతోనే టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది. ఇటీవల మరో స్టార్ హీరో రామ్ చరణ్ మూవీలో కూడా ఆమె ఛాన్స్ దక్కించుకున్న విషయం తెలిసిందే. అక్టోబర్ 10వ తేదీన విడుదల కానున్న దేవర ఫస్ట్ పార్ట్.. రూ.300 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. హరి కోస‌రాజు, సుధాక‌ర్ మిక్కిలినేనితో కలిసి హీరో క‌ళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నారు. విలన్ గా బాలీవుడ్ న‌టుడు సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత కేజీఎఫ్ ఫేమ్ ప్ర‌శాంత్ నీల్‌ తో తారక్ ఓ సినిమా చేయనున్నారు. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.









Untitled Document
Advertisements