'డీజే టిల్లుకి సీక్వెల్ గా సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా తెరకెక్కిన సినిమా టిల్లు స్క్వేర్. ఈ సినిమాలో హీరోయిన్ రాధిక పాత్ర ఎంత గొప్పగా పండిందో తెలిసిందే. ఆ సినిమా విజయంలో రాధిక కీలక పాత్ర పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ పాత్రకి నేహాశెట్టి నూరుశాతం న్యాయం చేసింది కాబట్టే సాధ్యమైంది. రాధిక పాత్రలో నేహా హవభవాలు ఆహార్యం ప్రతీ పాత్రని ఎంతో గొప్పగా హైలైట్ చేసింది. ఆ పాత్రతో యూత్ ఐకాన్ గా మారిపోయింది నేహశెట్టి అనడం లో సందేహంలేదు . అయితే
'టిల్లుస్వ్కేర్' లోనే లిల్లీ పాత్రకి నేహాశెట్టినే కొనసాగిస్తే బాగుండేదని చాలా మంది అభిప్రాయాలు వ్యక్తం చేసారు. కానీ సిద్దు జొన్నల గడ్డ-మల్లిక్ రాం ఆ పాత్రలో కొత్త నటిని చూపించాలని అనుపమ పరమేశ్వరన్ ని ఎంపిక చేసారు. ఎంతో మంది భామల్ని పరిశీలించి చివరికి ఆ పాత్రకు అనుపమ మాత్రమే సరితూగుతుందని మల్లిక్ రామ్ ఫైనల్ చేసారు. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలతో ఆ అనుపమ లిల్లీ పాత్రని ఎంత బోల్డ్ గా హైలైట్ చేస్తున్నారో? తెలుస్తుంది.
ఇలా చేయడంపై కొంత నెగిటివిటీ కూడా స్ప్రెడ్ అవుతుంది. బోల్డ్ గా చూపించడం కోసమే అనుపమని తీసుకున్నారా అన్న సందేహాలు తెరపైకి వస్తోన్న నేపథ్యంలో తాజాగా వాటిని నివృతి చేసాడు దర్శకుడు. ఇందులో లిల్లీ పాత్ర సవాల్ తో కూడుకున్నది. ఆ పాత్ర కోసం మడోన్నా సెబాస్టి యన్..మీనాక్షి చౌదరి ని పరిశీలించాం. కానీ వాళ్లకన్నా అనుపమ బెటర్ అనిపించింది. తనని బోల్డ్ గా చూపించాలని లిల్లీ పాత్ర రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి అనుపమ వంద శాతం న్యాయం చేసింది. వాస్తవానికి ఆపాత్ర కోసం ఆమెని ఎంపిక చేస్తే తప్పుకుంది. కథలోని బోల్డ్ అంశాలు నచ్చకే తను తప్పుకుందని అంతా అనుకున్నారు.కానీ అలాంటిది ఏమి కాదు తనకు చాల సినిమా ఆఫర్లు ఉండడం వలన డేట్స్ కుదరలేదు . అంతేకాని నాకు ఈ పాత్ర నచ్చడం లేదు అని చెప్పడం సరికాదు . అంతేకాక ఒక కమర్షియల్ సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ వదులుకుంటే నేను స్టుపిడ్ ని. నాకు కూడా డిఫరెంట్ పాత్రలు చేయాలని ఉంది. అంతేకాకుండా ఒక నటిగా డైరెక్టర్ ఏం చెప్పినా చేస్తాను. అందుకే ఈ సినిమా, ఆ సీన్స్ చేశాను, లైఫ్ లో కొత్తదనం ఉండాలి అంటూ ఉదాహరణలు చెప్పి మరీ సమాధానం ఇచ్చింది