నేట్టింట వైరల్ గా మారిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పోస్ట్

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 03:50 PM

నేట్టింట వైరల్ గా మారిన నేషనల్ క్రష్ రష్మిక మందన్న పోస్ట్

తెలుగులో చలో సినిమాలో నటించిన తర్వాత , గీతగోవిందం సినిమాతో ఒక్కసారిగా స్టార్ హీరోయిన్ అయిన రష్మిక మందన్న. ప్రస్తుతం బాలీవుడ్‌ లో యానిమల్‌ సినిమాతో అంతకు ముందు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ లో భారీ విజయాలను సొంతం చేసుకుని చాలా బిజీ అయ్యింది. కానీ ఇప్పుడు ఈ అమ్మడు రెండు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేయడంతో పాటు పుష్ప 2 ఇంకా మరో రెండు పెద్ద సినిమాల్లో నటిస్తున్న విషయం తెల్సిందే.
సోషల్ మీడియాలో రెగ్యులర్ గా అందాల ఆరబోత ఫోటోలు షేర్‌ చేసే రష్మిక మందన్న తాజాగా షేర్‌ చేసిన ఒక పోస్ట్‌ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆ పోస్ట్ లో వర్కౌట్ చేస్తున్న వీడియోను పోస్ట్‌ చేసింది. అంతే కాకుండా గత నాలుగు అయిదు నెలలుగా నేను బిజీ షెడ్యూల్‌ కారణంగా నా బాడీకి కావలసిన జిమ్‌ కి దూరంగా ఉన్నాను అంటూ పోస్ట్‌ చేసింది.
సాధారణంగా హీరోయిన్స్ మేకప్‌ మరియు జిమ్‌ ను వదిలి ఒక్క రోజు కూడా ఉండరు అంటారు. కానీ రష్మిక మందన్న ఏకంగా నాలుగు అయిదు నెలలు జిమ్ కు దూరంగా ఉండటం చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇన్ని నెలలు వర్కౌట్ చేయకున్నా కూడా రష్మిక అందం లో ఎలాంటి మార్పు రాలేదు . పైగా అందం మరింత పెరిగింది అన్నట్లుగా కామెంట్స్ వస్తున్నాయి. ఇకపై రెగ్యులర్‌ గా వర్కౌట్స్ చేస్తాను అని, తన డైలీ లైఫ్‌ లో ఏదో ఒక సమయంలో జిమ్‌ కి వెళ్తాను అన్నట్లుగా రష్మిక తన పోస్ట్‌ లో పేర్కొంది. ప్రస్తుతం రష్మిక మందన్న పుష్ప 2 లో నటిస్తున్న విషయం తెల్సిందే. ఇటీవల శ్రీవల్లి గెటప్ లోని వచ్చిన వీడియో వైరల్‌ అయ్యింది. యానిమల్‌ సూపర్‌ హిట్ నేపథ్యంలో రష్మిక మందన్న కు బాలీవుడ్‌ నుంచి ప్రముఖ హీరోలు మరియు దర్శకుల నుంచి ఆఫర్లు వస్తున్నట్లు సమాచారం అందుతోంది.దీన్ని బట్టి చుస్తే ఈ అమ్మడు చేతి నిండా సినిమాలతో బిజిగా ఉన్నట్లు తెలుస్తుంది .





Untitled Document
Advertisements