సొట్టబుగ్గల సుందరి తాప్సీ ఒక అడుగు ముందుకు వేసింది అనిచెపుకోవచ్చు . ఏంటి అనుకుంటున్నారా? అదే నండి ఈ అమ్మడు పెళ్లి చేసుకుంది . ఇది ఆశ్చర్యం కలిగించవచ్చు కానీ ఇది నిజం . పాపులర్ జాతీయ మీడియా న్యూస్ ప్రకారం తాప్సీ తన దీర్ఘకాల భాగస్వామి డానిష్ బ్యాడ్మింటన్ కోచ్ మథియాస్ బోను పెళ్లాడారు. ఈ శనివారం (23 మార్చి) నాడు అత్యంత రహస్యంగా జరిగిన ఈ వివాహానికి కొద్దిమంది కుటుంబ సభ్యులు, బాలీవుడ్ స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. 10 ఏళ్లుగా రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరూ ఉదయపూర్ను తమ వివాహ వేదికగా ఎంచుకున్నారు.తమ వివాహవేడుకను పూర్తి ప్రయివేట్ వ్యవహారంగా ఉంచారు. గత వారం వివాహానికి ముందస్తు వేడుకలు ప్రారంభమయ్యాయి. మీడియా హంగామా లేకుండా గోప్యత కోసం మాత్రమే ఈ జంట పెళ్లి విషయాన్ని చెప్పకుండా దాచింది. ఒక సన్నిహిత వ్యక్తి సమాచారం మేరకు ''వీరిద్దరూ చాలా ప్రైవేట్ - రిజర్వుడ్ వ్యక్తులు. అందుకే ప్రచారం కోరుకోలేదు''అని సోర్స్ చెబుతోంది. అతి కొద్ది మంది సన్నిహిత బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే ఈ పెళ్లికి హాజరయ్యారు.
పరిమిత అతిథుల జాబితాలో ముఖ్యంగా తాప్సీ స్నేహితుడు, దర్శకనిర్మాత అనురాగ్ కశ్యప్ ఉన్నారు. అనురాగ్ కశ్యప్ తాప్సీ పన్నుకు చాలా కాలంగా స్నేహితుడు. తాప్సీ నటించిన 'మన్మర్జియాన్'కు దర్శకత్వం వహించారు. నిర్మాత-రచయిత కనికా ధిల్లాన్, ఆమె భర్త హిమాన్షు శర్మ తదితర ప్రముఖులు కూడా ఈ పెళ్లికి హాజరయ్యారు. దొబారా, తప్పాడ్ లో సహనటి పావైల్ గులాటి కూడా ఈ వేడుకకు హాజరైంది. నిజానికి గత నెల రోజులుగా తాప్సీ పెళ్లిపై పుకార్లు షికార్లుగా చేస్తున్నాయి. సిక్కు మతం - క్రైస్తవ మతం ఆచారంలో గొప్ప సంప్రదాయ వేడుకగా ఈ పెళ్లి జరుగుతుందని కూడా కథనాలొచ్చాయి. తాప్సీ పన్ను - మాథియాస్ బో వారి వారి సంస్కృతుల అందాలను హైలైట్ చేసే ఒక గొప్ప ఈవెంట్ గా ఉంటుందని గుసగుసలు వినిపించాయి.కానీ చివరి కి ఎవరికీ తెలియకుండా రహస్యంగా చేసుకున్నారు .
జనవరి 2023లో బ్రైడ్స్ టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాప్సీ పన్నూ తన డ్రీమీ వెడ్డింగ్ కి సంబంధించి మాట్లాడుతూ.. తనను అర్థం చేసుకునేవాడు దొరికాడని వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్ కోర్ట్ నుండి బాలీవుడ్ వరకు బో ప్రయాణం, తాప్సీతో లవ్వాయణం ప్రతిదీ ఆసక్తికరం. 2013లో మొదటి ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్లో తాప్సీ పన్నూ -మాథియాస్ బో కలుసుకున్నారు. వారి మధ్య సంబంధం వేగంగా కుదిరింది. వారి కుటుంబాలు ఒకరికొకరు పరిచయాలు వగైరా అయ్యాయి. ఇంతకుముందు రాజ్ షమణితో పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో తాప్సీ పన్నూ బాలీవుడ్లోకి అడుగుపెట్టినప్పుడు బౌ ని కలిశానని వెల్లడించింది. 13 సంవత్సరాల క్రితం నటించడం ప్రారంభించాను. నేను బాలీవుడ్లోకి అడుగుపెట్టిన సంవత్సరంలో నేను అతనిని కలిశాను. అప్పటి నుండి నేను అదే వ్యక్తితో రిలేషన్ లో ఉన్నాను అని బహిరంగంగా వెల్లడించింది. అతనే పెళ్ళి చేసుకోవాలి అనుకుంటున్నాను అని చాల సందర్భాలలో చెప్పుకొచ్చింది .
అదేవిధంగా పెళ్లిబంధంతో ఒకటైనారు ఈ ప్రేమ జంట .