తెలుగు ఇండస్ట్రీలో అందం అభినయం తో పాటు ,డాన్స్ తో ప్రేక్షకులను మెప్పించినది శ్రియ. ఈ అమ్మడు గురించి చెప్పాల్సిన పనిలేదు. రెండు దశాబ్ధాల కాలంలో ఎన్నో భాషల్లో నటించిన అనుభం ఈమెది . ఎక్కడైనా సత్తా చాటే ప్రతిభ అమె సొంతం. నాలుగు పదుల వయసులోనే నవ నాయికలా వెలిగిపోతుందంటే ఇంతకు మించి ఆమె లో స్పెషాల్టీ గురించి ప్రత్యేకంగా చెప్పాలిసిన అవసరం ఏమి లేదు అనిపిస్తుంది. మరి అలాంటి నటి షూటింగ్ మధ్యలోనే భయపడి పారిపోయిందంటే నమ్ముతారా మీరు . మీ టార్చర్ నా వల్ల కాదంటూ అమ్మడు సైతం చేతులెత్తేసిందా? అంటే అవుననే విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఆ సంగతేంటో ఆమె మాటల్లోనే విధాము , నటిగా ఇండస్ట్రీలో ప్రయాణం మొదలైన కొత్తలో ఎన్నో సవాళ్లు ఎదుర్కున్నాను. ఒకసారి భయపడి ఏకంగా షూటింగ్ సెట్ నుంచి పరిగెత్తి పారిపోయాను. విక్రమ్ తో `కందస్వామి` సినిమా చేస్తోన్న సమయంలో ఒక్క షాట్ కి ఎన్నో టేక్ లు తీసుకునేదాన్ని. ఆ సమయలో విక్రమ్ ఎంతో ఓపికగా నన్ను భరించారు. ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేను. నేను అలా చేస్తే నిర్మాతకు ఎంత భారం కలుగుతుందో విక్రమ్ చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తున్నాయి.
రజనీకాంత్ తో` శివాజీ` సినిమా చేస్తున్న సమయంలో ఆయన నాకొక్క గొప్ప సలహా ఇచ్చారు. ఈరోజు అందం అభినయంతో సినిమాలు చేస్తు న్నావు. భవిష్యత్ లో పరిస్థితులు మారొచ్చు. వైఫల్యాలు ఎదురవ్వవొచ్చు. అయినా ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించాలి అని చెప్పిన సలహా నన్ను ఎంతో మార్చింది` అని అంది. ఇక శ్రియ తాజా కెరీర్ సంగతి చూస్తే ప్రస్తుతం అమ్మడికైతే చేతిలో అవకాశాలు లేవు. హిందీలో మాత్రం `షో టైమ్` అనే ఓటీవీ సిరీస్ చేస్తుంది. ఇది తప్ప ఛాన్సులేవి లేవు. కానీ సోషల్ మీడియా యాక్టివిటీ మాత్రం అలాగే కొనసాగుతుంది. ఎప్పటికప్పుడు ఘాటెన ఫోజులతో యువత అటెన్షన్ డ్రా చేస్తుంది. సినిమాలు లేకపోయిన ప్రేక్షకుల అభిమానం ఉంది కధా అని ఘాటైన మాటలతో , ఫోటో షూట్ లతో మేపిస్తుంది . కాలం ఎప్పటికి ఒకేలాగా ఉండదు కదా మనము దానికి అనుగుణంగా నడుచుకుపోవాలి అని అంటుంది ఈ అమ్మడు .