‘పతియే ప్రత్యక్ష దైవం’ అనేమాట నిజం చేస్తూ భర్తకు గుడి కట్టిన భార్య!

     Written by : smtv Desk | Thu, Apr 25, 2024, 11:42 AM

‘పతియే ప్రత్యక్ష దైవం’  అనేమాట నిజం చేస్తూ భర్తకు గుడి కట్టిన భార్య!

భార్యభర్తలు ఇద్దరు సంసారం అనే బండికి రెండు చక్రాల వంటి వారు అనేది జగమేరిగ్గియా సత్యం. ఇద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా సంసారం సాఫీగా సాగాడు. అయితే ఆలుమగల బంధంలో భర్తని దైవంగా కొలుస్తుంది ఆడది. అనుడుకు నిదర్శనంగా ‘పతియే ప్రత్యక్ష దైవం’ అన్న మాటను ఆమె నిజం చేసింది ఒక స్ట్రీ. మృతి చెందిన భర్త రూపం కళ్లముందే కదలాడుతుండటంతో దానిని శాశ్వతం చేసుకోవాలని భావించిన ఆమె భర్తకు గుడికట్టి తన కల నెరవేర్చుకుంది.

మహబూబాబాద్ జిల్లా అదే మండలంలోని పర్వతగిరి శివారు సోమ్లాతండాకు చెందిన కల్యాణి-బానోతు హరిబాబుకు 27 ఏళ్ల క్రితం వివాహమైంది. సంతానం లేకున్నా అన్యోన్యంగా జీవించారు. హరిబాబు మూడేళ్ల క్రితం కరోనాతో మృతి చెందాడు. అప్పటి నుంచి ఆమె మానసికంగా కుంగిపోయారు. భర్తను తలచుకుని రోదించారు.

ఆయన రూపం ఈ భూమిపై శాశ్వతంగా నిలిచిపోవాలని భావించిన కల్యాణి.. భర్తకు గుడి కట్టాలని నిర్ణయించారు. దాదాపు రూ. 20 లక్షలతో భర్తకు గుడికట్టించారు. రాజస్థాన్‌లో విగ్రహం తయారుచేయించారు. నిన్న గుడిలో భర్త నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. బంధువులతో కలిసి పూజలు చేశారు. ఘనంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి తండావాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆమె చేసిన ఈ పని ఆమెకు భర్త పై ఉన్న ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా భావిస్తున్నారు.





Untitled Document
Advertisements