మెరిసిన బెంగుళూరు..

     Written by : smtv Desk | Wed, May 02, 2018, 10:12 AM

మెరిసిన బెంగుళూరు..

బెంగుళూరు, మే 2 : రెండు ఓటముల తర్వాత బెంగుళూరు జట్టు సొంత గడ్డపై విజయం సాధించింది. చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో 14 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు ఐదో స్థానానికి ఎగబాకింది. రోహిత్ సేన ఆరో పరాజయంతో ప్లేఆఫ్ అవకాశాలను క్లిష్టతరం చేసుకుంది.

తొలుత టాస్ నెగ్గిన ముంబై జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన బెంగుళూరు జట్టులో మనన్‌ వోహ్రా (45), బ్రెండన్‌ మెక్‌కలమ్‌ (37), కోహ్లి (32) రాణించారు. దీంతో ఆ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడూ వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో హార్దిక్‌ పాండ్యా (3/28) ఆకట్టుకున్నాడు.

తర్వాత లక్ష్యఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ బ్యాట్స్ మెన్ ను కోహ్లిసేన 153 కట్టడి చేసింది. హార్దిక్ పాండ్యా (50) ఒక్కడే టాప్ స్కోరర్ గా నిలిచాడు. బెంగుళూరు బౌలర్లు ఉమేశ్‌ యాదవ్‌ (2/29), సౌథీ (2/25), సిరాజ్‌ (2/28), చాహల్‌ (0/23) కట్టుదిట్టంగా బౌలింగ్‌ చేయడంతో 7 వికెట్లకు 153 పరుగులే చేయగలిగింది. 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు టీమ్ సౌథీకి దక్కింది.





Untitled Document
Advertisements