హైదరాబాద్, మే 24 : యంగ్ హీరో నాగశౌర్య హీరోగా, షామిలి జంటగా తెరకెక్కిన చిత్రం 'అమ్మమ్మ గారిల్లు'. కుటుంబ కథ నేపథ్యంలో, బంధాలు, అనుబంధాలు కాన్సెప్ట్తో వచ్చిన చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్, సాంగ్స్కు పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా టీజర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ ట్రైలర్ చూస్తే.. ఈ సినిమా కథను ఎవరైనా ఊహించవచ్చు.
అయితే అందరికీ తెలిసిన కథే అయినా... తీసే విధానం, స్ర్కీన్ ప్రజెంటేషన్తో ప్రేక్షకుల మెప్పించవచ్చు. ట్రైలర్లో.. "జీవితంలో కలిసి రావాలంటే కూతుర్ని కనాలి... తెలిసిరావాలంటే కొడుకును కనాలి" అంటూ రావు రమేశ్ చెప్పిన డైలాగ్లు బాగానే ఉన్నాయి. ఈ సినిమాను స్వాజిత్ బ్యానర్పై రాజేశ్ నిర్మించగా... సుందర్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం రేపు (మే 25) ధియేటర్లలో సందడి చేయనుంది.