కాంగ్రెస్‌ది స్కాముల ప్రభుత్వం.. మాది స్కీముల ప్రభుత్వం

     Written by : smtv Desk | Fri, Jul 20, 2018, 01:17 PM

కాంగ్రెస్‌ది స్కాముల ప్రభుత్వం.. మాది స్కీముల ప్రభుత్వం

ఢిల్లీ, జూలై 20 : కాంగ్రెస్‌ది స్కాముల ప్రభుత్వం.. మాది స్కీముల ప్రభుత్వం అని బీజేపీ ఎంపీ రాకేశ్ సింగ్ పేర్కొన్నారు. టీడీపీ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఆయన లోక్‌సభలో మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించిన కాంగ్రెస్ పార్టీతోనే కలిసి ఇప్పుడు టీడీపీ ముందుకు సాగుతుంది అని తెలిపారు. "మోదీ పథకాలతో పేదల ముఖాలపై చిరునవ్వులు కనిపిస్తున్నాయి. యూపీఏది మచ్చపడిన ప్రభుత్వం, మాది స్వచ్ఛ ప్రభుత్వం. రెండు కోట్లమందికి పైగా పేదలకు ఇళ్లు కట్టించాం. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్యబీమా తీసుకొచ్చాం. దేశ ప్రజల ఆశలు, ఆకాంక్షలతో బలమైన ప్రభుత్వం ఏర్పడింది. పరస్పర విరుద్ధమైన శక్తులు ఏకమై అవిశ్వాసం తీసుకొచ్చాయి. ప్రజలు విశ్వసించిన ప్రభుత్వంపై ప్రజల నమ్మకం కోల్పోయిన పార్టీలు తెచ్చిన అవిశ్వాసం ఇది. 2019లో నరేంద్ర మోదీ నాయకత్వంలో చేయబోయే విజయాత్రను అడ్డుకునే విఫలయత్నం ఇది. దేశంలో, ప్రపంచంలో అత్యంత విశ్వసనీయ నాయకుడిపై అవిశ్వాసం పెడతారా? దేశంలో మొదటిసారిగా ఇంత మెజార్టీతో కాంగ్రెస్సేతర ప్రభుత్వం ఏర్పడింది. మోదీ పారదర్శకమైన పాలన అందిస్తున్నారు." అని రాకేశ్ సింగ్ వ్యాఖ్యానించారు.





Untitled Document
Advertisements