హైదరాబాద్, జూలై 20 : యువ హీరో శర్వానంద్.. ప్రస్తుతం దర్శకుడు హనురాఘవపూడితో ఒక సినిమా., అలాగే సుధీర్ వర్మతో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు. అయితే ఈ యువ హీరో కోసం దర్శకుడు క్యూ కట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దర్శకులు.. శ్రీకాంత్ అడ్డాల, శ్రీనివాస రాజు శర్వాను సంప్రదించి కథను వినిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఇంద్రగంటి మోహన కృష్ణ సైతం ఓ కథను వినిపించినట్లు తెలుస్తోంది.
అయితే ఈ యువ హీరో ఇప్పటివరకు కథలనైతే వింటున్నాడు కానీ ఏ ప్రాజెక్ట్ కి ఓకే చెప్పడం లేదట. ప్రస్తుతం తను చేస్తున్న రెండు సినిమాలను పూర్తి చేసిన తర్వాతనే ఆలోచిస్తాడని తెలుస్తోంది. ఇదివరకు శర్వా చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో దర్శక నిర్మాతల దృష్టి ఆయనపై పడింది. ఒకరకంగా చెప్పాలంటే ఇది శర్వాకు ప్లస్ పాయింట్. ఇప్పటికి ఆయన వద్దకు వచ్చి స్టోరీ చెప్పే దర్శకుల సంఖ్య ఎక్కువవుతోంది. మరి శర్వా ఎవరి సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి.