తొలి రౌండ్ ముగిసేసరికి ఆటగాళ్ళ ఖరీదు వివరాల్లు

     Written by : smtv Desk | Tue, Dec 18, 2018, 06:15 PM

తొలి రౌండ్ ముగిసేసరికి ఆటగాళ్ళ ఖరీదు వివరాల్లు

జైపూర్, డిసెంబర్ 18: 2019 ఐపీఎల్ సీజన్ కోసం ఆటగాళ్ళ వేలం చాలా ఉత్కంఠ భరితంగా కొనసాగుతూ వుంది తొలిరౌండ్ ముగిసేసరికి ఈ సారి వేలంలో పేసర్‌ ఉనాద్కట్‌ను రూ. 8.4 కోట్లకు రాజస్థాన్ జట్టు కొనుగోలు చేసింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు ఇదే అత్యధికం. ఇక వెస్టిండీస్ ఆల్‌రౌండర్ బ్రాత్‌వైట్‌ను రూ.5కోట్లకు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సొంతం చేసుకుంది. వెస్టిండీస్ జట్టుకు చెందిన మరో ఆటగాడు హెట్‌మైర్‌ను రూ.4.2 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు కొనుగోలు చేసింది. హనుమ విహారిని ఢిల్లీ జట్టు రూ.2కోట్లకు, అక్సర్ పటేల్‌ను రూ.5కోట్లకు సొంతం చేసుకుంది. మలింగను ముంబై ఇండియన్స్ రూ. 2 కోట్లకు, ఇషాంత్ శర్మను రూ. 1.1 కోట్లకు ఢిల్లీ క్యాపిటల్స్ దక్కించుకున్నాయి. హెన్రిక్స్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు రూ.కోటికి కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టోను హైదరాబాద్ జట్టు రూ.2.2కోట్లకు దక్కించుకుంది. వికెట్ కీపర్ సాహాను సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ.1.20 కోట్లకు కొనుగోలు చేసింది. విండీస్ కీపర్ నికోలస్ పూరన్‌ను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ రూ.4.20 కోట్లకు దక్కించుకుంది. షమీని రూ. 4.8 కోట్లకు పంజాబ్ కొనుగోలు చేయగా... మోహిత్ శర్మను రూ. 5 కోట్లకు సొంతం చేసుకుంది చెన్నై సూపర్ కింగ్స్. ప్రస్తుతం ఐపీఎల్ 2019 వేలం పాట కొనసాగుతోంది.





Untitled Document
Advertisements