జగిత్యాల, జనవరి 9: జిల్లాలోని ఓ సెల్ ఫోన్ షాప్ లో చోరీకి పాల్పడి రూ. 70 లక్షలు విలువ చేసే ఫోన్లను దోచుకెళ్ళారు దుండగులు. పోలీసుల వివరాల ప్రకారం జగిత్యాల పట్టణంలోని అంగడి బజార్ లో ఉన్న భవానీ సెల్ పాయింట్ షాపులో అర్దరాత్రి దొంగలు చొరబడి ఉన్న సెల్ ఫోన్లన్ని ఎత్తుకెళ్ళారు. షాప్ దగ్గరికి బొలెరో వాహనంలో వచ్చి ఐరన్ రాడ్ తో షెట్టర్ పైకి లేపి లోపలి చొరబడ్డారు.
అనంతరం షోకేస్లో ఉన్న అన్ని సెల్ఫోన్లు, గల్లాలో ఉనన 10 లక్షల నగదును దోచుకెళ్లారు. ఈ తతంగం మొత్తం సీసీ కెమెరాలో రికార్డయ్యింది. చోరీకి గురైన ఆస్తి విలువ సుమారు 70 లక్షలు ఉంటుందని యజమాని తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు క్లూస్ టీంతో పాటు సీసీ కెమెరా ఫుటేజ్ సాయంతో నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.