వాషింగ్టన్, ఫిబ్రవరి 16: గురువారం కాశ్మీర్ లోని పుల్వామా లో జరిగిన ఉగ్గ్రవాదుల దానిని అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే. అంతేకాక అమెరికా భద్రతా సలహాదారు జాన్ బోల్డన్, భారత్ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్తో ఫోన్లో మాట్లాడి సంతాపం తెలిపారు.
ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ ఎలాంటి చర్యలు చేపట్టినా వాటికి తాము పూర్తి స్థాయి మద్దతు తెలుపుతామని బోల్డన్ హామి ఇచ్చారు. ఉగ్రవాదాలకు పాక్ స్వర్గధామంగా ఉండొద్దని ఆ దేశానికి చెబుతూనే ఉన్నాంగ అని బోల్టన్ తెలిపారు.