మొదటి సినిమా ఆడలేదంటా......ఆ తరువాత సినిమాకు తిరుగు లేదంటా

     Written by : smtv Desk | Sat, Feb 16, 2019, 06:35 PM

మొదటి సినిమా ఆడలేదంటా......ఆ తరువాత సినిమాకు తిరుగు లేదంటా

హైదరాబాద్, ఫిబ్రవరి 16: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామా రావు గారి జీవితాధారంగా తెరకెక్కుతున్న సినిమా 'ఎన్టీఆర్'. ఈ సినిమాను రెండు భాగాలుగా చేసి విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. పోయిన సంక్రాంతికి మొదటి భాగం 'ఎన్టీఆర్ కథానాయకుడు' సినిమాను విడుదల చేశారు. ఇక రెండో పార్ట్ 'ఎన్టీఆర్ మహానాయకుడు' సినిమాను ఈ నెల 22న విడుదల కానుంది.

ఇక ఈ సినిమా నుండి తాజాగా ఓ ట్రైలర్ ను కొంత సేప‌టి క్రిత‌మే విడుద‌ల చేశారు. ఎన్‌టీఆర్ బ‌యోపిక్ మొద‌టి భాగంలో ఎన్‌టీఆర్ సినీ జీవితాన్ని తెర‌పై చూపించ‌గా, ఇప్పుడు రెండో భాగంలో ఆయ‌న రాజ‌కీయ జీవితాన్ని తెర‌పై చూపించ‌నున్నారు. అయితే ఓ వైపు సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ తెర‌కెక్కించిన ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ట్రైల‌ర్ కూడా ఇప్ప‌టికే విడుద‌లై సంచ‌నాల‌ను సృష్టిస్తోంది. మ‌రి ద‌ర్శ‌కుడు క్రిష్ తీసిన ఎన్‌టీఆర్ మ‌హానాయ‌కుడు ట్రైల‌ర్ కూడా అదే రేంజ్‌లో సంచ‌నాల‌ను రేకెత్తిస్తుందో, లేదో చూడాలి. ఆ విష‌యం మ‌రికొన్ని గంట‌లు ఆగితే తెలుస్తుంది.

ఎన్‌టీఆర్ మ‌హానాయ‌కుడు సినిమా ఈ నెల 22వ తేదీన ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా వ‌ర్మ తీసిన ల‌క్ష్మీస్ ఎన్‌టీఆర్ సినిమా విడుద‌ల తేదీని మాత్రం ఆ చిత్ర యూనిట్ ఇంకా వెల్ల‌డించ‌లేదు. కానీ మ‌హానాయ‌కుడు సినిమాకు పోటీగానే ఆ సినిమాను కూడా విడుద‌ల చేయాల‌ని వ‌ర్మ భావిస్తున్న‌ట్లు తెలిసింది. మ‌రి రెండు సినిమాల్లో ఏ సినిమా ప్రేక్ష‌కుల‌ను రంజింప‌చేస్తుందో.. వేచి చూస్తే తెలుస్తుంది..!





Untitled Document
Advertisements