'నేను లోకల్' దర్శకుడితో వెంకీమామ

     Written by : smtv Desk | Thu, May 23, 2019, 11:15 AM

'నేను లోకల్'  దర్శకుడితో వెంకీమామ

వెంకటేశ్ కథానాయకుడిగా ఈ మధ్య వచ్చిన 'ఎఫ్ 2' సంచలన విజయాన్ని నమోదు చేసింది. ఈ సినిమాలో వెంకటేశ్ చేసిన కామెడీ ప్రేక్షకులకు కితకితలు పెట్టేసింది. వెంకటేశ్ కి గల క్రేజ్ ఎంతమాత్రం తగ్గలేదని ఈ సినిమా నిరూపించింది. ఈ సినిమా తరువాత సినిమాగా ఆయన 'వెంకీమామ' చేస్తున్నాడు. బాబీ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా కూడా పూర్తి వినోదభరితంగా నిర్మితమవుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది.

ఈ సినిమా షూటింగు పూర్తికాగానే వెంకటేశ్ మరో ప్రాజెక్టు పట్టాలెక్కనుంది. నక్కిన త్రినాథరావుతో కలిసి వెంకటేశ్ సెట్స్ పైకి వెళ్లనున్నాడు. సురేశ్ ప్రొడక్షన్స్ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కూడా కామెడీ ప్రధానంగా సాగనుందని చెబుతున్నారు. 'సినిమా చూపిస్తమావ' .. 'నేను లోకల్' వంటి సినిమాలు చేసిన నక్కిన త్రినాథరావు, ఈ సినిమాను కూడా అటు యూత్ ను .. ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా ప్లాన్ చేసినట్టు చెబుతున్నారు.





Untitled Document
Advertisements