న్యూజిలాండ్: ఆక్లాండ్లో రంజాన్ వేడుకల సందర్భంగా తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ ఇఫ్తార్ విందును ఘనంగా నిర్వహించింది. ప్యారడైజ్ రెస్టారెంట్లో ఏర్పాటు చేసిన ఈ విందుకు సుమారు 200 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా విందుకు హాజరైన వారందరూ ప్రార్థనలు చేసి.. ఉపవాస దీక్ష విరమించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ న్యూజిలాండ్ అధ్యక్షుడు నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు దయానంద్, సభ్యులు ప్రసన్న, నర్సింగ్, కార్తీక్, కిరణ్, ధర్మేందర్, విజయ్తో పాటు మాజీ అధ్యక్షుడు కల్యాణ్, సలహాదారులు రామ్మోహన్, సురేందర్ పాల్గొన్నారు.