స్పైస్ జెట్ విమానం టైర్ పగిలిపోవడంతో అధికారులు అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. దుబాయ్-జైపూర్ ఎస్ జీ 58 విమానం 189 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఇవాళ ఉదయం 9.30 నిమిషాల సమయంలో టేకాఫ్ అయిన వెంటనే టైర్ పేలిపోవడంతో..అత్యవసరంగా విమానాన్ని జైపూర్ ఎయిర్ పోర్టులో ల్యాండింగ్ చేశారు. పైలట్ అప్రమత్తంగా ఉండటంతో ప్రయాణికులకు ఎలాంటి నష్టం జరుగలేదు. ప్రయాణికులందరినీ సురక్షితంగా కాపాడారు.