సౌదీ విమానాశ్రయంపై రెబల్స్‌ దాడి....26 మందికి గాయాలు

     Written by : smtv Desk | Wed, Jun 12, 2019, 06:39 PM

సౌదీ విమానాశ్రయంపై రెబల్స్‌ దాడి....26 మందికి గాయాలు

సౌదీ: బుధవారం సౌదీ అరేబియాలోని ఓ విమానాశ్రయంపై దాడులు జరిగాయి. యెమెన్‌కు చెందిన హౌతి రెబల్స్‌ ఈ వైమానిక దాడులకు పాల్పడ్డారు. అయితే ఈ మిస్సైల్‌ దాడితో 26 మంది పౌరులు గాయపడ్డారు. బుధవారం ఉదయం అబా ఎయిర్‌పోర్టుపై మిస్సైల్‌ దాడి జరిగింది. లక్ష్యాన్ని అత్యంత ఖచ్చితంగా పేల్చినట్లు హౌతి రెబల్స్‌ తెలిపారు. యెమెన్‌లో హౌతి రెబల్స్‌ నాలుగేళ్లుగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారు. ఐతే ప్రభుత్వానికి సౌదీ కూటమి దేశాలు మద్దతిస్తున్నాయి.





Untitled Document
Advertisements