ధావన్ పరిస్థితిపై కోహ్లి స్పందన

     Written by : smtv Desk | Fri, Jun 14, 2019, 05:41 PM

ధావన్ పరిస్థితిపై కోహ్లి స్పందన

నాటింగ్‌హామ్‌: గాయం కారణంగా మ్యాచ్ కు దూరమైన టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ పరిస్థితిపై తాజాగా ఆ జట్టు కాప్టెన్ విరాట్ కోహ్లి స్పందించాడు. గురువారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌ రద్దైన తర్వాత కోహ్లి మాట్లాడుతూ ..తర్వాతి మ్యాచుల్లో ధావన్‌ తిరిగి ఆడతాడని తెలిపాడు. రెండు ,మూడు వారాల తర్వాత అతని పరిస్థితి సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నాడు. ధావన్‌ త్వరగా కోలుకుని మిగతా లీగ్‌ మ్యాచులతో పాటు సెమీఫైనల్స్‌లో ఆడతాడని కోహ్లి ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆదివారం పాక్‌తో జరిగే మ్యాచులో రోహిత్‌కు జోడిగా కేఎల్‌ రాహుల్‌ ఓపెనర్లుగా ఆడే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements