న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం ముందస్తు బడ్జెట్పై ఆమె పలువురు ఆర్థికవేత్తలతో సమావేశయ్యారు. ఈ సమావేశంలో పాల్గొన్న వారి సలహాలను అడిగి తెలుసుకున్నారు. అయితే బడ్జెట్ 2019లో పన్ను సంస్కరణలు చేపట్టాలని వారు ఆమెను కోరారు. జిఎస్టి(వస్తు, సేవల పన్ను) సులభతరం, ప్రత్యక్ష పన్ను కోడ్ అమలు, ఉద్యోగాల పరంగా వృద్ధికి చర్యలు, ఆర్థికంగా మెరుగైన పాలన వంటి అంశాలపై ఆర్థికవేత్తలు సూచనలు చేశారు. ఆర్థికమంత్రి ఇప్పటికే పరిశ్రమ, రైతు సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఇది ఆరో ముందస్తు బడ్జెట్ సమావేశం, అయితే జులై 5న లోక్సభలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు.