ఎలుకల మందు పనిచేస్తుందా లేదా అని తిని చూసాడంట!!

     Written by : smtv Desk | Mon, Jun 17, 2019, 12:01 PM

ఎలుకల మందు పనిచేస్తుందా లేదా అని తిని చూసాడంట!!

కృష్ణా జిల్లాలో విషాదఘటన చోటుచేసుకుంది. ఎలుకల మందు రుచిచూసిన ఓ యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. రాబర్ట్ అనే యువకుడు పాస్టర్ గా ఓ చర్చిలో శిక్షణ పొందుతున్నాడు. చర్చిలో ఎలుకల బెడద ఎక్కువగా ఉండడంతో ఎలుకల మందును ఆహార పదార్థంలో కలిపి పెట్టారు. అయితే, ఎలుకల మందు పనిచేస్తుందో లేదో అని రాబర్ట్ తాను కూడా కొద్దిగా ఎలుకల మందును రుచిచూశాడు. ఘాటైన విషపదార్థం కావడంతో రాబర్ట్ ఆరోగ్యం కొద్దిసేపట్లోనే క్షీణించింది. దాంతో చర్చి సిబ్బంది అతడిని ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు.





Untitled Document
Advertisements