బుధవారం కూడా దేశీయ ఇంధన ధరలు నిలకడగా కొనసాగాయి. ధరల్లో గత నాలుగు రోజులుగా ఎటువంటి మార్పు లేదు. దీంతో హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.74.32 వద్ద, డీజిల్ ధర రూ.69.58 వద్ద ఉంది. దేశంలోని ఇతర నగరాల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి. అమరావతిలో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగానే ఉన్నాయి. పెట్రోల్ ధర రూ.74.11 వద్ద, డీజిల్ ధర రూ.69.03 వద్ద ఉంది. ఇక విజయవాడలో పెట్రోల్ ధర రూ.73.76 వద్ద, డీజిల్ ధర రూ.68.71 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.69.93 వద్ద, డీజిల్ ధర రూ.63.84 వద్ద ఉంది. వాణిజ్య రాజధాని ముంబయిలో కూడా పరిస్థితి ఇలానే ఉంది. పెట్రోల్ ధర రూ.75.63 వద్ద, డీజిల్ ధర రూ.66.93 వద్ద కొనసాగుతోంది.