సౌత్ ఇండియా నుంచి ఒకేఒక్కడు

     Written by : smtv Desk | Fri, Aug 16, 2019, 08:00 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సరికొత్త రికార్డు సృష్టించబోతున్నాడు... సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ఆ రికార్డు కెక్కిన ఒకేఒక్కడు నిలబోతున్నాడు టాలీవుడ్ డార్లింగ్. బాహుబలి తర్వాత క్రేజీ ప్రాజెక్టుకుగా తెరక్కెక్కిన "సాహో" మూవీ ఈ నెల 30వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. మరోవైపు ప్రమోషన్ స్పీడ్‌ పెంచిన చిత్ర యూనిట్ ఈ నెల 18న ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించనుంది. అయితే, రిలీజ్‌కు ముందే సాహోతో రికార్డుల వేట ప్రారంభించాడు యంగ్ రెబల్ స్టార్.

వరల్డ్ వైడ్‌గా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ రూ. 350 కోట్లు దాటిపోగా.. ఓ థియేటర్‌లో ఈ సినిమా ప్రదర్శనతో సౌత్ ఇండియన్ నంబర్ వన్ హీరోగా రికార్డు సృష్టించనున్నాడు. సాహో చిత్రాన్ని పారిస్‌లోని ప్రతిష్టాత్మక థియేటర్ "లి గ్రాండ్ రెక్స్"లో ప్రదర్శించనున్నారు. యూరప్‌ ఖండంలోనే అతిపెద్ద థియేటర్‌గా ప్రసిద్ధిగాంచిన ఈ థియేటర్‌.. ఈ ప్రఖ్యాత థియేటర్లో సాహో మూవీ ప్రదర్శించనున్నారు. గతంలో సూపర్ రజనీకాంత్ కబాలి, విజయ్ మెర్సల్, బాహుబలి చిత్రాలు మాత్రమే సౌత్ ఇండియా నుంచి ప్రదర్శించారు. అయితే, బాహుబలి తర్వాత సాహో కూడా అక్కడ రిలీజ్ చేయనుండడంతో సౌత్ ఇండియాలోనే రెండు సినిమాలు ఆ థియేటర్‌లో రిలీజ్ చేసిన తొలి హీరోగా ప్రభాస్ రికార్డు సృష్టించబోతున్నారు. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. సుజీత్ దర్శకత్వం వహించాడు. ఈ భారీ బడ్జెట్ మూవీని యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది.





Untitled Document
Advertisements