సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం భారీ సెట్ ..ఖర్చు ఎంతో తెలుసా ?

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 10:06 AM

సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటిలో భారీ ఎత్తున జరగబోతున్నది. ఈ ఈవెంట్ కోసం రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రభాస్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్షమందికి పైగా అభిమానులు ఈ వేడుకకు హాజరు కాబోతున్నారని తెలుస్తోంది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రోగ్రామ్స్ కోసం మాములుగా ఓ వేదికను ఏర్పాటు చేస్తారు. రంగు రంగుల కలర్స్ తో నింపేస్తారు. కానీ, సాహో ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఓ భారీ సెట్ ను వేస్తున్నారట. ఈ సెట్ కోసం దాదాపుగా రూ. 2 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సెట్ లో సాహో కోసం వినియోగించిన ఖరీదైన కార్లు, బైకులను ప్రదర్శన పెట్టబోతున్నారు. ఈ ఏడాది మోస్ట్ వాంటెడ్ ఫిల్మ్ గా ఈ సినిమా రాబోతున్నది. ఈ వేడుకలో ప్రభాస్ తో పాటు యూనిట్ మొత్తం పాల్గొనబోతున్నట్టు సమాచారం.





Untitled Document
Advertisements