స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

     Written by : smtv Desk | Sun, Aug 18, 2019, 02:44 PM

స్వల్పంగా తగ్గుముఖం పట్టిన పసిడి ధరలు

బంగారం ధరల పరుగుకు బ్రేకులు పడ్డాయి. ఆదివారం(ఆగస్ట్18)న పసిడి ధర స్వల్పంగా తగ్గుముఖం పట్టింది. దీంతో హైదరాబాద్ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.40 తగ్గుదలతో రూ.39,360కు క్షీణించింది. అంతర్జాతీయంగా బలహీనమైన ట్రెండ్ సహా జువెలర్లు, రిటైలర్ల నుంచి డిమాండ్ తగ్గడంతో ధరపై ప్రతికూల ప్రభావం పడిందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. అదేసమయంలో 10 గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.50 తగ్గుదలతో రూ.36,070కు క్షీణించింది. బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. కేజీ వెండి ధర నిలకడగా రూ.47,850 వద్ద కొనసాగుతోంది. పరిశ్రమ యూనిట్లు, నాణేపు తయారీదారుల నుంచి డిమాండ్‌లో పురోగతి లేకపోవడం ఇందుకు కారణం. విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఇలానే ఉన్నాయి. గ్లోబల్ మార్కెట్‌లో శుక్రవారం బంగారం ధర దిగొచ్చింది. పసిడి ధర ఔన్స్‌కు 0.48 శాతం తగ్గుదలతో 1,523.80 డాలర్లకు క్షీణించింది. అదేసమయంలో వెండి ధర ధర ఔన్స్‌కు 0.74 శాతం క్షీణతతో 17.08 డాలర్లకు తగ్గింది. ఢిల్లీ మార్కెట్‌లో పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.300 పెరుగుదలతో రూ.38,400కు చేరింది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.300 పెరుగుదలతో రూ.37,200కు ఎగసింది. ఇక కేజీ వెండి నిలకడగా కొనసాగింది. రూ.47,850 వద్ద స్థిరంగా ఉంది.





Untitled Document
Advertisements