ముదురుతున్న వివాదం - చిక్కుల్లో 'వాల్మీకి'

     Written by : smtv Desk | Wed, Sep 18, 2019, 02:14 PM

ముదురుతున్న వివాదం - చిక్కుల్లో 'వాల్మీకి'

వరుణ్ తేజ్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన 'వాల్మీకి' చిత్రం ఈనెల 20న విడుదల కాబోతోంది. మరోవైపు ఈ సినిమా టైటిల్ పై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, సినిమాకు వాల్మీకి అని పేరు పెట్టడం వల్ల కొందరి మనోభావాలు దెబ్బతింటాయని చెప్పారు. వాల్మీకి చిత్రం పేరును వెంటనే మార్చాలని డిమాండ్ చేశారు.

టీవీ5, ఏబీఎన్ ఛానళ్లపై నిషేధం విధించడం సరికాదని... పత్రికా స్వేచ్ఛను హరించాలనుకోవడం రాజ్యాంగ విరుద్ధమని చెప్పారు. గతంలో టీడీపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా పాలించిందని... గత ప్రభుత్వం కంటే రెండింతలు ఎక్కువగా అప్రజాస్వామిక పాలన చేసే ధోరణిలో వైసీపీ ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.





Untitled Document
Advertisements