తమిళ హీరో కార్తీ ‘దొంగ’గా ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాలో కార్తి వదిన, సూర్య భార్య జ్యోతిక కీలక పాత్రలో నటించడం మరో విశేషం. ‘దృశ్యం’ ఫేమ్ జీతు జోసెఫ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది. డిసెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న ఈ సినిమాను హర్షిత మూవీస్ అధినేత రావూరి వి. శ్రీనివాస్ తెలుగులో అందిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఈ సినిమా టీజర్కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో చిత్ర ప్రచారంలో భాగంగా మంగళవారం సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్తో పాటు కథకి తగ్గ యాక్షన్ కూడా ఉందని ట్రైలర్ చూస్తుంటే తెలుస్తోంది. మొత్తంగా చూసుకుంటే మంచి ఎంటర్టైన్మెంట్తో కూడిన థ్రిల్లర్ను కార్తి ప్రేక్షకులను అందించబోతున్నట్టు అర్థమవుతోంది. జీతు జోసెఫ్ మరో హిట్టు కొట్టేలా ఉన్నారు. కాగా, ఈ సినిమాలో కార్తి సరసన నిఖిలా విమల్ హీరోయిన్గా నటించింది. గోవింద వసంత సంగీతం సమకూర్చారు.