ప్రైవేటురంగ యస్ బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు సైటాక్స్ హోల్డింగ్స్, సైటాక్స్ ఇన్వెస్ట్మెంట్ గ్రూప్ 500 మిలియన్ డాలర్ల ఆఫర్ను పరిగణనలోకి తీసుకోవడానికి ఆసక్తిగా ఉంది. ఈమేరకు బ్యాంక్ స్టాక్ మార్కెట్లకు సమాచారం ఇచ్చింది. ఎర్విన్ సింగ్ బ్రాచ్, ఎస్పిజిపి హోల్డింగ్స్ నుండి 1.2 బిలియన్ డాలర్ల ఆఫర్ కూడా బోర్డు డైరెక్టర్ల పరిశీలనలో ఉందని పేర్కొంది. ఈ ప్రతిపాదనలను పరిశీలించడానికి బ్యాంక్ డైరెక్టర్ల బోర్డు మంగళవారం సమావేశమైంది. సిటాక్స్ హోల్డింగ్స్ గ్రూపులకు సెక్యూరిటీల కేటాయింపుపై తుది నిర్ణయం తదుపరి బోర్డు సమావేశంలో ఉంటుందని బోర్డు డైరెక్టర్లు నిర్ణయించారు. ఇది అవసరమైన నియంత్రణ ఆమోదాలపై ఆధారపడి ఉంటుంది. ఎర్విన్ సింగ్, ఎస్పిజిపి హోల్డింగ్స్ 1.2 బిలియన్ డాలర్ల ఆఫర్ బోర్డు డైరెక్టర్ల పరిశీలనలో ఉందని బ్యాంక్ తెలిపింది. పెట్టుబడిదారుల నుండి 2 బిలియన్ డాలర్ల వరకు ప్రతిపాదనలను కూడా బ్యాంక్ పరిశీలిస్తోంది. మూలధనం లేకపోవడం వల్ల సెప్టెంబర్ త్రైమాసికంలో ప్రైవేట్ రంగ బ్యాంకు ఖాతాలు బలహీనపడ్డాయి.