ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం టెన్త్, ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలను విడుదల చేసింది. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దినేష్ శర్మ నేడు ఫలితాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం ఫలితాల్లో ఫస్ట్ ర్యాంక్ సాధించిన వారికి లక్ష రూపాయల నగదు ప్రోత్సాహకంతో పాటు ల్యాప్టాప్ బహుమతిగా ఇవ్వనున్నట్లు తెలిపారు. అదేవిధంగా టాపర్లు ఎవరైతే ఉన్నారో వారి ఇళ్లకు రోడ్ల సదుపాయాలు లేనట్లయితే రోడ్లు కూడా నిర్మిస్తామని ఉపముఖ్యమంత్రి దినేష్ శర్మ ప్రకటించారు.