108 ఉద్యోగులకు ఏపీ సీఎం జగన్ తీపి కబురు

     Written by : smtv Desk | Wed, Jul 01, 2020, 12:53 PM

108 ఉద్యోగులకు  ఏపీ సీఎం జగన్ తీపి కబురు

ఆంధ్రప్రదేశ్‌లో 108 ఉద్యోగులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీపి కబురు చెప్పారు. డ్రైవర్ల జీతం రూ.10వేల నుంచి రూ.18-28వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. టెక్నీషియన్స్ జీత రూ.12వేల నుంచి 20-30వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పెంచిన జీతాలు ఇవాళ్టి నుంచే అమలు చేస్తారు.. ముఖ్యమంత్రి జగన్ నిర్ణయంపై డ్రైవర్లు, సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు.
ఇంతకు ముందుకు డ్రైవర్లకు నెలకు రూ.10వేలు జీతం వస్తుండగా ఇకపై వారి సర్వీసుకు అనుగుణంగా రూ.18వేల నుంచి 20వేల రూపాయల వరకు అందనుంది. అలాగే ఎమెర్జెన్సీ మెడికల్‌ టెక్నీషియన్ల జీతాలను కూడా పెంచుతున్నట్లు సీఎం జగన్‌ ప్రకటించారు. ప్రస్తుతం రూ.12వేల జీతం అందుకుంటున్న మెడికల్‌ టెక్నీయన్‌ ఇకపై రూ.20 వేల నుంచి 30 వేల వరకు అందుతుందని సీఎం జగన్‌ చెప్పారు.

అంతకముందు ముఖ్యమంత్రి జగన్ విజయవాడలో 108, 104 వాహనాలు ప్రారంభించారు. అనంతరం గుంటూరు జీజీహెచ్‌లో కేన్సర్ విభాగాన్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అనంతరం మాట్లాడిన పలు కీలక నిర్ణయాలు ప్రకటించారు.. 108 సిబ్బంది జీతం పెంచుతున్నట్లు చెప్పారు. ఏపీ చరిత్రలో ఈరోజు చాలా ప్రత్యేకమైనదని సీఎం వ్యాఖ్యానించారు. డాక్టర్స్ డే రోజు 108,104 వాహనాలు, కేన్సర్ విభాగాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు.

రాబోయే రోజుల్లో ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తామన్నారు ముఖ్యమంత్రి జగన్. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి మండలానికి రెండు పీహెచ్ (ప్రైమరీ హెల్త్ సెంటర్లు) ఏర్పాటు చేస్తామన్నారు.. అంబులెన్స్‌లో ఉండే డాక్టర్ ప్రతి ఊరును చెక్ చేసి రోగులకు మందులిస్తారన్నారు. ఫ్యామిలీ డాక్ర్ట కాన్సెప్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నామని.. ఎలక్ట్రానిక్ కార్డులు కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి పేషెంట్‌కు సంబంధించిన డిజిటల్ రికార్డు కూడా ఉంటుందని.. వాటిని విలేజ్, వార్డు క్లినిక్‌లకు పీహెచ్‌సీ సెంటర్లకు అనుసంధానం చేస్తామన్నారు.



గతంలో ఆస్పత్రులు ఎలా ఉండేవో చూశామని.. ఆస్పత్రుల్లో ఎలుకలు కొరికి పిల్లలు చనిపోయే పరిస్థితి ఉండేదన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నాడు-నేడు ద్వారా ప్రభుత్వ ఆస్పత్రుల రూపు రేఖలు పూర్తిగా మార్చేస్తున్నామన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.





Untitled Document
Advertisements