ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్...జూలై 1 నుంచి కొత్త రూల్స్

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 10:00 AM

ఆధార్ కార్డు ఉన్న వారికి అలర్ట్...జూలై 1 నుంచి కొత్త రూల్స్

2020 ఏడాదిలో జూలై 1ని చాలా కీలకమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటారేమో.. ఈరోజు నుంచే చాలా అంశాలు మారాయి. ఆదాయపు పన్ను, ఆధార్‌కు సంబంధించిన రూల్స్‌‌లో కూడా మార్పు వచ్చింది. ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయాలంటే కచ్చితంగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సిందే.

అంటే మీరు ఆధార్ నెంబర్ కలిగి లేకపోతే ఇకపై ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ITR దాఖలు చేయడం కుదరదు. దీంతో జూలై నుంచి ఆధార్ ప్రాధాన్యం మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఆధార్ కార్డు లేకపోతే పాన్ కార్డు Pan Card కూడా తీసుకోవడం కుదరకపోవచ్చు.

విదేశీ వ్యవహారాల శాఖ కూడా కీలక నిర్ణయం తీసుకుంది. పాప్‌పోర్ట్ తీసుకోవడానికి ఆధార్ నెంబర్ కచ్చితంగా ఉండాలని తెలియజేసింది. అంటే జూలై 1 తర్వాత మీరు PassPort పాస్‌పోర్ట్ తీసుకోవాలని యోచిస్తే.. తప్పనిసరిగా ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.

మరోవైపు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) కూడా పీఎఫ్ అకౌంట్‌తో ఆధార్ కచ్చితంగా లింక్ చేసుకోవాలని ఎప్పటి నుంచో చెబుతూ వస్తోంది. అలాగే పెన్షన్ తీసుకుంటున్న వారు కూడా ఆధార్ నెంబర్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ లింక్ చేసుకోవడం వల్ల PF పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు సులభంగానే విత్‌డ్రా చేసుకోవచ్చు.





Untitled Document
Advertisements