నాలుగు సినిమాల నైజాం హక్కులు కొనుగోలు చేసిన ఒకే డిస్ట్రిబ్యూటర్!

     Written by : smtv Desk | Thu, Jul 02, 2020, 06:10 PM

నాలుగు సినిమాల నైజాం హక్కులు కొనుగోలు చేసిన ఒకే డిస్ట్రిబ్యూటర్!

నైజాం ఏరియాకు చెందిన ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీనివాస్ నాలుగు భారీ చిత్రాల థియేట్రికల్ రైట్స్‌ను సొంతం చేసుకున్నారు. రవితేజ ‘క్రాక్’, గోపీచంద్ హీరోగా తెరకెక్కుతోన్న ‘సీటీమార్’, శర్వానంద్ ‘శ్రీకారం’, రానా దగ్గుబాటి చిత్రం ‘విరాటపర్వం’ సినిమాల నైజాం థియేట్రికల్ హక్కులను వరంగల్ శ్రీనివాస్ కొనుగోలు చేశారు. ఈ సినిమాల హక్కుల కోసం చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు పోటీ పడగా శ్రీనివాస్ ప్రతి సినిమాకు మంచి ధర ఇచ్చి సొంతం చేసుకున్నారు.



ఒకవేల కరోనా వైరస్, లాక్‌డౌన్ లేకపోయుంటే ఈ నాలుగు సినిమాలు ఇప్పుడు విడుదల అయ్యేవి. కానీ, ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒకసారి ప్రభుత్వం అనుమతి ఇచ్చి థియేటర్లు తెరుచుకున్నాక ఈ సినిమాల విడుదల తేదీలను ప్రకటిస్తారు. కాగా, ఈ సినిమాలతో పాటు మరికొన్ని సినిమాల నైజాం హక్కులను కొనుగోలు చేయాలని శ్రీనివాస్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మేరకు మరికొంత మంది నిర్మాతలతో ఆయన సంప్రదింపులు జరుపుతున్నారు.


సినిమా డిస్ట్రిబ్యూషన్ మాత్రమే కాకుండా వరంగల్ శ్రీనివాస్ నిర్మాతగానూ తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ప్రస్తుతం ఆయన ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఆ సినిమా ఇప్పటికే సగం షూటింగ్ పూర్తిచేసుకుంది. మిగిలిన షూటింగ్ ఫారన్ లొకేషన్స్‌లో చేయనున్నారు. ఈ సినిమాతో పాటు మరో రెండు కొత్త ప్రాజెక్ట్‌లను శ్రీనివాస్ లైన్‌లో పెట్టారు.





Untitled Document
Advertisements