కశ్మీర్‌లో బయటపడ్డ ఉగ్రవాదుల రహస్య స్థావరం

     Written by : smtv Desk | Sat, Jul 04, 2020, 04:34 PM

కశ్మీర్‌లో బయటపడ్డ ఉగ్రవాదుల రహస్య స్థావరం

జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రవాదుల కోసం సైన్యం వేట కొసాగుతోంది. కశ్మీర్‌‌లో విధ్వంసానికి ముష్కరులు చేస్తున్న ప్రయత్నాలను సైన్యం తిప్పికొడుతోంది. తీవ్రవాదుల కుట్రలను భగ్నం చేస్తూ, వారిని దీటుగా ఎదుర్కొంటోంది. తాజాగా, ఉగ్రవాదులు దాచిపెట్టిన ఆయుధాల డంప్‌ను సైన్యం, జమ్మూ కశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రాజౌరీలోని తానమండి సబ్-డివిజన్‌లో ఉగ్రవాదులు దాచిపెట్టిన ఆయుధాలు బయటపడ్డాయి. దోడాసన్ బాలా గ్రామంలో జరిగిన ఆపరేషన్‌లో జమ్మూ కశ్మీర్ పోలీసులు, ఆర్మీ సంయుక్త బృందం ఉగ్రవాద రహస్య స్థావరాన్ని ధ్వంసం చేసింది. ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకుంది. ఇందులో ఏకే 47 తుపాకులు, హ్యాండ్ గ్రనేడ్లు ఉన్నట్టు అధికారులు తెలిపారు. కుల్గామ్‌లోని అరేహ్ ప్రాంతంలో ఉగ్రవాదులు ఏరివేత ఆపరేషన్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్‌లో ఓ ఉగ్రవాదిని సైన్యం మట్టుబెట్టింది. ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు గాయపడ్డారు. సీఆర్పీఎఫ్, ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా పాల్గొన్నాయని కుల్గామ్ ఎస్పీ గురీందర్‌పాల్ సింగ్ వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇద్దరు నుంచి ముగ్గురు ఉగ్రవాదులున్నట్టు అనుమానిస్తున్నారు.





Untitled Document
Advertisements