పూరీ జగన్నాథ్ ప్రస్తుతం తెలుగు, హిందీ భాషల్లో విజయ్ దేవరకొండతో ‘ఫైటర్’ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. తెలుగు, హిందీ భాషల్లో చేస్తోన్న ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగింది. పరిస్థితులు చక్కబడ్డ తర్వాత మళ్లీ షూటింగ్ మొదలవుతుంది. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ సినిమాకు హిందీలో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా.. పూరీ జగన్నాథ్ ఈ సినిమాకు మణిశర్మను మ్యూజిక్ డైరెక్టర్ అని అనుకుంటే, కరణ్ మాత్రం బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్ను తీసుకుందామని చెబుతున్నారట. బేసిగ్గా పూరి సినిమాల్లో ఆయన తీసుకునే నిర్ణయమే ఫైనల్. అలాంటిది ఇప్పుడు పూరి తీసుకున్న నిర్ణయంలో కరణ్ అడ్డుపడుతున్నట్లే. మరి పూరి కరణ్జోహార్ను ఒప్పించి మణిశర్మతో మ్యూజిక్ చేయిస్తారో లేదో చూడాలి.