ఆగస్ట్ 19న ఏపీ కేబినెట్ సమావేశం

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 04:58 PM

ఆగస్ట్ 19న ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ కేబినెట్ ఈ నెల 19న సమావేశంకానుంది. ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న ఈ భేటీ నిర్వహించనున్నారు. ఈ స‌మావేశంలో ప‌లు కీల‌క‌మైన అంశాల‌పై చ‌ర్చించి నిర్ణ‌యం తీసుకోనున్నారు. రాష్ట్రంలో కరోనా ఉదృతి ఎక్కువ ఉండటంతో దీనిపై చర్చించనున్నారు. ఈ సమావేశంలో ముఖ్యంగా రాష్ట్రంలో కరోనా నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. అలాగే కొత్త జిల్లాల ఏర్పాటు.. జిల్లాల ఏర్పాటుపై కమిటీ వేయడంతో ఈ అంశం ప్రాధాన్యత ఏర్పడింది. ఈ అంశంపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పై కూడా ప్రధానంగా చర్చించనున్నారు. మరోవైపు మూడు రాజధానుల అంశం, ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంపైనా చర్చించే అవకాశం ఉంది.





Untitled Document
Advertisements