జియో దూకుడు...సగం పైగా మార్కెట్ వాటా!

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 03:15 PM

జియో దూకుడు...సగం పైగా మార్కెట్ వాటా!

దేశంలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య పెరుగుతూనే వస్తోంది. 2020 మార్చి చివరి నాటికి 74.3 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు. త్రైమాసికం పరంగా చూస్తే 3.4 శాతం పెరుగుదల నమోదైంది. టెలికం రెగ్యులేటర్ ట్రాయ్ తాజా క్వాటర్లీ పర్ఫార్మెన్స్ డేటాలో ఈ విషయం వెల్లడైంది.

దేశంలోని అపర కుబేరుడు ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో దుమ్మురేపుతోంది. ఏకంగా 52 శాతానికి పైగా మార్కెట్ వాటాతో దూసుకెళ్తోంది. జియో తర్వాతి స్థానంలో భారతీ ఎయిర్‌టెల్ ఉంది. దీని మార్కెట్ వాటా 23.6 శాతం. ఇక వొడాఫోన్ ఐడియా మూడో స్థానంలో కొనసాగుతోంది. దీని మార్కెట్ వాటా 18.7 శాతం.

అంటే ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా రెండింటి మార్కెట్ వాటాను కలిపినా కూడా రిలయన్స్ జియోకి సమానంగా లేకపోవడం గమనార్హం. 2019 డిసెంబర్‌లో 71.87 కోట్లుగా ఉన్న ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2020 మార్చి నాటికి 74.31 కోట్లకు చేరిందని ట్రాయ్ తెలిపింది.

వైర్‌లెస్ ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల విషయానికి వస్తే.. 72 కోట్లకు పైనే ఉంది. అంటే మొత్తం ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్లలో వీరి వాటా 97 శాతం. ఇక వైర్డ్ ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్ల సంఖ్య 2.2 కోట్లుగా ఉంది. బ్రాడ్‌బాండ్ ఇంటర్నెట్ యూజర్ల సంఖ్య పెరుగుతూ వస్తోందని ట్రాయ్ తెలిపింది. మొత్తం ఇంటర్నెట్ సబ్‌స్క్రైబర్లలో 96.9 శాతం మంది మొబైల్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగిస్తున్నారు.

ఇంటర్నెట్ సబ్‌స్క్రిప్షన్స్ ప్రకారం టాప్ 5 సర్వీస్ ఏరియాలను గమనిస్తే.. మహరాష్ట్ర టాప్‌లో ఉంది. దీని తర్వాత స్థానంలో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయి. ఇక మూడో స్థానంలో యూపీ ఉంది. తమిళనాడు నాలుగో స్థానంలో, మధ్యప్రదేశ్ ఐదో స్థానంలో నిలిచాయి.





Untitled Document
Advertisements