రూ.90లక్షలు ఇస్తే రూ.. కోటి

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 02:19 PM

రూ.90లక్షలు ఇస్తే రూ.. కోటి

రూ.90లక్షలు ఇస్తే రూ.. కోటి ఇస్తామని మోసాలు చేస్తున్న ముఠా ఆటకట్టించారు పోలీసులు. రూ.2వేల నోట్లు ప్రభుత్వం రద్దు చేస్తోందని నమ్మించి బురిడీ కొట్టించే ప్రయత్నం చేశారు. కాకినాడ రూరల్‌ వలసపాకలకు చెందిన గంగరాజునగర్‌ రోడ్డు నంబరు 7కు చెందిన చలగళ్ళ నాగప్రసాద్‌ను ఫోన్‌లో విశాఖపట్నానికి చెందిన నలుగురు, కాకినాడ కర్ణంగారి వీధికి చెందిన ఒకరు కలిపి మోసం చేసేందుకు ప్రయత్నించారు. రూ.90 లక్షల రూ.5 వందల నోట్లకు రూ.కోటి (2వేల నోట్లు) అందిస్తామని నమ్మించారు.

తొలుత ఒక వీడియోలో రూ.2వేల నోట్లతో కూడిన అట్టపెట్టెలు భారీగా ఉన్నట్టు చూపించి, ఆ తరువాత ఫోన్‌ ద్వారా రూ.2వేల నోట్లు ఎక్కువగా ఉన్నాయని, రూ.500 నోట్లు తమకు కావాలని నమ్మబలికారు. నాగమల్లిజంక్షన్‌ వద్దకు రావాలని కోరడంతో అనుమానం వచ్చిన నాగప్రసాద్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆయన సమాచారం మేరకు నిఘా పెట్టి పోలీసులు విశాఖపట్నం, కాకినాడకు చెందిన ఐదుగుర్ని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.





Untitled Document
Advertisements