రియల్ హీరో సోనూసూద్ ఏది చేసినా సంథింగ్ స్పెషల్ అనేట్టుగానే చేస్తుంటారు. తాజాగా హైదరాబాద్ నగరంలో సైకిల్ తొక్కుతూ నగరవాసుల్ని సర్ ప్రైజ్ చేశారు.
దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రజల మదిలో రియల్ హీరోగా స్థిర స్థాయిగా నిలిచిన సోనూసూద్ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ లొకేషన్కి సైకిల్ మీద వెళ్లి సర్ ప్రైజ్ చేశారు.
ఉదయాన్నే షూటింగ్ ఉండటంతో.. సైక్లింగ్ ఇష్టపడే సోనూసూద్ సైకిల్ ఎక్కి హైటెక్ సిటీ, దుర్గమ్మ చెరువు బ్రిడ్జీ మీదుగా షూటింగ్ లొకేషన్ స్పాట్కి చేరుకున్నారు. అయితే దేశ వ్యాప్తంగా రియల్ హీరోగా కీర్తించబడుతున్న సోనూసూద్ సైకిల్పై ప్రత్యక్షమమ్యే సరికి ఆయన్ని చూసిన వాహనదారులు సర్ ప్రైజ్కి గురి అయ్యారు. ఆయన్న దగ్గర నుంచి చూస్తూ కరచాలనం చేయడానికి పోటీపడ్డారు. చాలా వాహనాలు ఆయన్ని వెంబడించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇక ఆచార్య చిత్రానికి సంబంధించి అప్డేట్స్ విషయానికి వస్తే.. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ మే 13న విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉన్న నేపథ్యంలో వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో చిరంజీవి, రాం చరణ్ తేజ, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే, సోనూసూద్ తదితరులు నటిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
#SonuSood Cycles His Way to #Acharya Shoot!! #MegastarChiranjeevi #RamCharan #KoratalaSiva pic.twitter.com/C76JC5Ti04
mdash; YouWe Media (@MediaYouwe) April 14, 2021