న్యూఢిల్లీ, డిసెంబర్ 16: భారతీ ఎయిర్టెల్తో టెలికమ్యూనికేషన్ ప్రపంచ రంగాన్నే మార్చేసిన సునిల్ మిట్టల్, ఆయన జీవితంలో ఎదుర్కొన్న సవాళ్లను, ఇబ్బందులను గుర్తు చేసుకుంటూ ఢిల్లీలో జరిగిన టైకాన్ సదస్సులో మాట్లాడారు. ఒకానొక సమయంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఉన్నపుడు రూ.5000 కోసం బ్రిజ్మోహన్ లాల్ ముంజల్ను ఆశ్రయించానని తెలిపారు. ఆ సమయంలో బ్రిజ్మోహన్ ఇదే అలవాటుగా మార్చుకోకు అంటూ గట్టి సలహా ఇచ్చారని, ఆయన చెప్పిన మాటలు తన హృదయాన్ని తాకాయని అన్నారు.
అదేవిధంగా ఆఫ్రికాలో అడుగుపెట్టడం తప్పయిందని, దీనివల్ల వ్యాపారాన్ని దారిలో పెట్టేందుకు కొన్ని సంవత్సరాల పాటు తాను భారీ స్థాయిలో నిధులను తన వ్యక్తిగత సమయాన్నీ ఖర్చుచేయా ల్సి వచ్చిందని చెప్పారు. తప్పు చేయడం మానవ సహజమని, వెనుదిరిగి చూసుకుంటే, అప్పుడలా చేసి ఉండాల్సి కాదు.. మరింత ఆలోచించి ఉంటే బాగుండేది.. అనిపించే సందర్భాలు అందరి జీవితాల్లోనూ చాలా ఉంటాయని పేర్కొన్నారు.