మరో పాన్ ఇండియా సినిమా?

     Written by : smtv Desk | Thu, May 06, 2021, 04:37 PM

మరో పాన్ ఇండియా సినిమా?

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాతో దేశ వ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు అతను. అర్జున్ రెడ్డి సినిమా తర్వాత విజయ్ వరుస ప్రాజెక్టులతో బిజీ అయ్యాడు. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్‌లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. అయితే లైగర్ తర్వాత విజయ్ మరో పాన్ ఇండియా సినిమా చేయనున్నాడు. భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ విజయ్‌తో జత కట్టనుందని తెలుస్తోంది. అందులో భాగంగానే ఇన్‌స్టాగ్రామ్‌లో కత్రినా.. విజయ్‌ని ఫాలో అవుతోంది. అంతేకాక.. కత్రినా కొన్ని వారాలకు ముందు ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన ఓ పోస్ట్ కూడా అందుకు సంకేతమని అనిపిస్తోంది. ‘న్యూ డే.. న్యూ హెయిర్ కట్.. న్యూ ఫిలిమ్’అంటూ కత్రినా పెట్టిన పోస్ట్ విజయ్ సినిమా గురించే అని అభిమానులు అనుకుంటున్నారు.





Untitled Document
Advertisements