కరోనాతో నటి కవిత కుమారుడు కన్నుమూత

     Written by : smtv Desk | Thu, Jun 17, 2021, 12:14 PM

కరోనాతో నటి కవిత కుమారుడు కన్నుమూత

మహమ్మారి కరోనా వైరస్ కారణంగా ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రిటీలు ఈ లోకం విడిచివెళ్లారు. రీసెంట్‌గా సెకండ్‌ వేవ్‌ విజృంభణ మరోసారి అందరినీ ఆదోళనలో నెట్టేసింది. సాధారణ ప్రజలతో పాటు ఎందరో నటీనటుల ఇంట విషాదం మిగిల్చింది కరోనా వైరస్. సినిమా ఇండస్ట్రీని ఇంకా పట్టి పీడిస్తూనే ఉన్న ఈ మహమ్మారి తాజాగా సౌత్ ఇండియన్ సీనియర్ యాక్ట్రెస్ కవిత ఇంట తీవ్ర విషాదాన్ని నింపింది.

ఎన్నో సినిమాల్లో నటించి దక్షిణాది సినిమా ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి కవిత కుటుంబాన్ని వెంటాడిన కరోనా వైరస్.. ఆమె కుమారుడు సంజయ్‌ రూప్‌‌ని పొట్టన పెట్టుకుంది. సంజయ్ కొన్ని రోజులుగా కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ గత రాత్రి తుదిశ్వాస విడిచారు. మరోవైపు కవిత భర్త దశరథ రాజు కూడా కరోనా కాటుకు గురై.. ఆరోగ్యం విషమించడంతో గత కొన్ని రోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కవిత కుమారుడు మరణించారని తెలిసి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకుంది కవిత. 11 ఏళ్ల వయసులో వెండితెరపై అడుగుపెట్టిన ఆమె.. కె. విశ్వనాధ్ దర్శకత్వంలో తెరకెక్కిన సిరి సిరి సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా స్థిరపడి కొన్ని వందల సినిమాల్లో నటించింది.





Untitled Document
Advertisements