ఐపీఎల్ లో ఫైనల్స్ కి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ ..

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 10:23 AM

 ఐపీఎల్ లో  ఫైనల్స్ కి దూసుకెళ్లిన గుజరాత్ టైటాన్స్ ..

ఐపీఎల్ 2022 సీజన్లో గుజరాత్ టైటాన్స్ జట్టు ఫైనల్స్కు చేరుకుంది. రాజస్థాన్ రాయల్స్ తో మంగళవారం రాత్రి కోల్కతాలోని ఈడెన్ గార్డెన్లో జరిగిన క్వాలిఫైయర్ వన్ మ్యాచ్లో గెలిచి నేరుగా ఫైనల్కు దూసుకెళ్లింది. అయితే ఈ మ్యాచ్ కూడా చివరి ఓవర్ వరకు ఉద్వేగ భరితంగా కొనసాగింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టు ఓపెనర్ యశస్వి జైస్వాల్ తొందరగానే పెవిలియన్ చేరగా.. మరొక ఓపెనర్ జాబ్స్ బట్లర్ ప్రారంభంలో నిమ్మదిగా ఆడిన ఇన్ని చివరిలో విధ్వంసక ఇన్నింగ్స్తో 89 పరుగులు చేసి వెనుతిరిగాడు. మరియు రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ 47 అవుటయ్యాడు. ఇంకో బ్యాట్స్మెన్ పడిక్కల్ 28 పరుగులు చేయగా.. అంతా ఒక డిజిట్ స్కోరుకే పరిమితమయ్యారు. దీంతో రాజస్థాన్ భారత జట్టు 20 ఓవర్లలో ముగిసేసరికి 188 పరుగులు చేసి ఆరోగ్యం కోల్పోయింది . గుజరాత్ బౌలర్లలో షమి , దయాల్ , సాయి కిషోర్ , పాండ్య ఒక్కో వికెట్ ను పడగొట్టారు. 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఈ క్రమంలో మొదటిలోనే ట్రెంట్ బౌల్ట్ వేసిన మొదటి ఓవర్లో వృద్ధిమాన్ సాహా డకౌట్ గా వెనుతిరిగాడు. అయినా కూడా మిగతా బ్యాట్స్మెన్ అందరూ నిలకడగా ఆడి జట్టుకు విజయాన్ని అందించారు. గిల్ 35 , మ్యాథ్యూ వేడ్ 35 పరుగులు చేసి అవుట్ అవ్వగా.. తరువాత బ్యాటింగ్ కు వచ్చిన కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు డేవిడ్ మిల్లర్ లు వికెట్ పడకుండా వరుసగా హార్దిక్ పాండ్యా 40 డేవిడ్ మిల్లర్ 68 పరుగులు చేసి జట్టుకు విజయాన్ని అందించారు. అయితే ఆఖరి ఓవర్లో 16 పరుగులు అవసరం ఉన్న క్రమంలో డేవిడ్ మిల్లర్ హ్యాట్రిక్ సిక్సర్లు బాది జట్టుకు విజయాన్ని అందించాడు. విజయంతో గుజరాత్ టైటాన్స్ జట్టు నేరుగా ఫైనల్కు చేరుకోవడం రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ లో గెలిచిన టీం తో క్వాలిఫైయర్ టు ఆడనుంది.





Untitled Document
Advertisements