శివసేనను బీజేపీ కాటేయ్యనుందా..?

     Written by : smtv Desk | Fri, Jun 24, 2022, 12:48 PM

శివసేనను బీజేపీ కాటేయ్యనుందా..?

శివసేనను తనవైపు మళ్ళించేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది .రాడిసన్ బ్లూ హోటల్లో ఉన్న రెబల్ గ్రూప్ నేతలను బీజేపీ నాయకుడు ,అస్సాం మంత్రి అశోక్ సింఘాల్ కలిసారు .ఈ సందర్భంగా వారి ముందు భారి ఆఫర్ ఉంచినట్లు తెలిస్తుంది .రాష్ట్ర ప్రభుత్వంలో 8 కాబినెట్ మంత్రి పదవులు ,5 సహాయక మంత్రి పదవులు ఇస్తామని ,ఒకవేళ శివసేన ఎంపీలు వస్తే కేంద్రంలో 2 మంత్రి పదవులు కేటాయిస్తామని చెప్పినట్లు సమాచారం .మరోవైపు బీజేపీ తీరును నిరసిస్తూ అస్సాంలో టిఎంసి నేతలు ఆందోళనకి దిగారు .మహారాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోవడం వెనుక బీజేపీ హస్తం ఉందని ఆరోపిస్తూ త్రుణల్ కాంగ్రెస్ నేతలు గౌహతిలో షిండే వర్గం ఉన్న హోటల్ ముందు ఆందోళనకి దిగారు .వరదలతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోతే పట్టించుకోకుండా కేవలం రాజకీయాల కోసం బీజేపీ పాకులడుతుందని మండి పడ్డారు .ఈ సందర్భంలో మల్లిఖార్జున్ ఖర్గే ఈ విధంగా వ్యాఖ్యానించారు.... "శివసేన ఎమ్మెల్యేలను ముందు సూరత్ తీసుకువెళ్ళారు .సూరత్ లో ఎవరి ప్రభుత్వం ఉందొ మీకు తెలుసు .మళ్ళి అక్కడి నుండి గౌహతి తీసుకువెళ్ళారు, దీనితోనే అర్ధమవుతుంది ఇది బీజేపీ ఆడించే ఆట అని ".మహారాష్ట్ర ప్రభుత్వాన్ని బీజేపీ అస్థిర పరిచేందుకు అన్ని విధాల ప్రయత్నిస్తుందని ,దేశంలో బీజేపీయేతర ప్రభుత్వాలు అస్థిత్వంలో లేకుండా చేస్తుందని అయన అన్నారు .





Untitled Document
Advertisements