తరగతి గదినే బెడ్‌రూమ్‌గా మార్చుకున్న తాగుబోతు హెడ్‌ మాస్టర్..

     Written by : smtv Desk | Fri, Nov 25, 2022, 05:30 PM

తరగతి గదినే బెడ్‌రూమ్‌గా మార్చుకున్న తాగుబోతు హెడ్‌ మాస్టర్..

ఓ పాఠశాలలో హెడ్‌ మాస్టర్ చేసిన పని నివ్వెరపోయేలా చేసింది. పాఠశాల నిర్వహణ చూడాల్సిన ఆయన ఫుల్‌గా తాగి.. హాయిగా పడుకున్నాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని అమరావతిలో జరిగింది. మెల్‌ఘాట్‌లోని ఓ పాఠశాలలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ వీడియోలో.. చొక్కా విప్పేసి ప్రిన్సిపాల్ హాయిగా తరగతి గది నేలపై పడుకోవడం చూడవచ్చు. ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్టు తెలుస్తుంది.
ఫుల్‌గా మద్యం సేవించి.. మత్తులో ఉన్న హెడ్ మాస్టర్.. ఇంటి వెళ్లలేక తరగతి గదినే బెడ్‌రూమ్‌గా మార్చుకున్నాడు. క్లాస్‌రూమ్‌లో ఆయన నిద్రపోయిన దృశ్యాలను కొందరు తమ కెమెరాల్లో బంధించారు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దాంతో ఆ వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు తెగ స్పందిస్తున్నారు. ఆ ప్రిన్సిపాల్‌పై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కామెంట్లు పెడుతున్నారు.
కొన్ని రోజుల క్రితం ఇలాంటి సంఘటనే పంజాబ్‌లో చోటుచేసుకుంది. విద్యార్థులకు పాఠాలు బోధించాల్సిన మ్యాథ్స్ ప్రొఫెసర్.. మద్యం సేవించి.. క్లాస్ రూమ్‌కు వెళ్లాడు. గురునానక్ దేవ్ యూనివర్సిటీకి చెందిన కాలేజీలో మాథ్స్ ప్రొఫెసర్‌ రవీందర్ కుమార్ తప్పతాగి కాలేజికి వెళ్లాడు. అతటితో ఆగకుండా పాటలు పాడుతూ.. డ్యాన్స్ కూడా వేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. అది వైరల్ అవ్వడంతో.. కాలేజీ యజమాన్యం ఆయనపై చర్యలు తీసుకుంది. https://twitter.com/i/status/1595348758984019968





Untitled Document
Advertisements